English | Telugu

విమర్శలకి సమాధానం ఇచ్చిన  చిరంజీవి నయా పిక్  

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ఇటలీ లో వరుణ్ తేజ్ అండ్ లావణ్య త్రిపాఠి ల పెళ్లి హడావిడి లో బిజీ గా ఉన్నారు. నిన్ననే వరుణ్,లావణ్యల పెళ్లి చాలా ఘనంగా జరిగింది. చిరంజీవి తో పాటు మెగా ఫ్యామిలీ మొత్తం ఈ పెళ్ళిలో పాల్గొంది. ఆద్యంతం ఎంతో అట్టహాసంగా జరిగిన ఈ వేడుకకి సంబంధించిన పిక్ ఒక దాన్ని మెగాస్టార్ తన ఎక్స్ వేదికగా పంచుకోవడం తో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలాగే ఆ పిక్ సోషల్ మీడియా లో సంచలనం సృష్టిస్తుంది.

మెగా స్టార్ చిరంజీవి తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వధూవరులైన వరుణ్,లావణ్య లతో కలిసి తను,పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ లు కలిసి దిగిన ఫోటోని పోస్ట్ చేసారు. ఈ ఫోటో వైరల్ అవడం తో పాటు మెగా అభిమానుల్లో కూడా ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చింది. గత కొన్ని నెలలుగా మెగా ఫ్యామిలీ లో విబేధాలు ఉన్నాయనే వార్తలు వస్తున్న నేపథ్యంలో మెగా స్టార్ ఈ ఒక్క ఫోటో తో అలాంటి రూమర్స్ అన్నింటికీ చెక్ పెట్టినట్టయ్యింది. అలాగే ఎవరు ఎన్ననుకున్న మెగా ఫ్యామిలీ ఎప్పుడు ఒకటే అని కూడా చెప్పినట్టయ్యింది. అల్లు అర్జున్ కి చిరంజీవి ఫ్యామిలీ కి మధ్య విబేధాలు ఉన్నాయని అనుకునేవాళ్ళకి కూడా మెగాస్టార్ పిక్ సమాధానం చెప్పినట్టయింది. నాగబాబు కూడా ఆ పిక్ లో ఉన్నారు

మెగా స్టార్ కి మొదటినుంచి కుడా తన కుటుంబం అంటే ఎంతో అభిమానం. ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే తన ఫ్యామిలీ మొత్తం ఒక చోట ఉండాలని చిరు కోరుకుంటారు.ఇప్పుడు వరుణ్ పెళ్లితో మరో సారి మెగా స్టార్ తన కోరికని నెరవేర్చుకున్నారు. ఇంతకీ మెగా స్టార్ వరుణ్ కి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చి ఉంటాడో అని తెలుసుకోవాలనే ఆసక్తి అటు మెగా అభిమానులతో పాటు సినీ అభిమానుల్లో కూడా ఉంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.