English | Telugu

విశ్వంభర సెకండ్ హాఫ్ లీక్.. చిరంజీవి వీడియో వైరల్ 

మెగాస్టార్ 'చిరంజీవి'(Chiranjeevi) అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ 'విశ్వంభర'(Vishwambhara).'జగదేక వీరుడు అతిలోకసుందరి' తర్వాత చిరంజీవి నుంచి వస్తున్న సోషియో ఫాంటసీ మూవీ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను విశ్వంభర' పై భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా ఈ చిత్రానికి సంబంధించిన చివరి సాంగ్ ని కూడా చిరంజీవి కంప్లీట్ చెయ్యడం జరిగింది. ఈ ఏడాది సంక్రాంతికే 'విశ్వంభర' విడుదల కావాల్సి ఉంది. రీసెంట్ గా విశ్వంభర కి సంబంధించి చిరంజీవి ఒక వీడియో రిలీజ్ చేశారు.

అందులో చిరంజీవి మాట్లాడుతు 'విశ్వంభర' ఎందుకు డిలే అవుతుందని చాలా మందికి డౌట్ ఉంది. ఈ ఆలస్యం విశ్వంభర కి సంబంధించి కరెక్ట్ అని అనుకుంటున్నాను. విశ్వంభర సెకండ్ ఆఫ్ మొత్తం విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ పై ఆధారపడి ఉంది. అత్యున్నత ప్రమాణాలతో, బెస్ట్ క్వాలిటీ తో విశ్వంభర ని మీ ముందు ఉంచాలనే దర్శక నిర్మాతల ప్రయత్నమే ఆలస్యానికి ప్రధాన కారణం. సినిమా విషయంలో ఎలాంటి విమర్శలు రాకూడదనే మా ప్రయత్నం. చందమామ కథలాగా సాగిపోయే అద్భుతమైన కథ. చిన్న పిల్లలకి, ముఖ్యంగా పెద్ద వాళ్ళల్లో ఉండే చిన్నపిల్లలకి ఎంతో వినోదాన్ని ఇస్తుంది. నా పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు సాయంత్రం 6 .06 నిమిషాలకి విశ్వంభర నుంచి గ్లింప్స్ రాబోతుంది. అది మీ అందర్నీ ఆకట్టుకుంటుంది. వయసుతో సంబంధం లేకుండా అందరు ఎంజాయ్ చేసే సమ్మర్ సీజన్ లో
విశ్వంభర విడుదల కాబోతుందని తెలిపాడు. అగస్ట్ 22 చిరంజీవి పుట్టిన రోజనే విషయం తెలిసిందే.

విశ్వంభర లో చిరంజీవి సరసన 'త్రిష'(Trisha)తో పాటు 'ఆషిక రంగనాధ్'(Ashika Ranganath)జంటగా చేస్తుండగా యువి క్రియేషన్స్(Uv Creations)పై వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ లో ఇప్పటికే రన్ రాజా రన్, రాధే శ్యామ్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వంటి పలు చిత్రాలు వచ్చాయి. నందమూరి కళ్యాణ్ రామ్ తో బింబిసార ని తెరకెక్కించిన వశిష్ట మల్లిడి (Vasishta Mallidi)దర్శకుడు కాగా ఆస్కార్ విన్నర్ కీరవాణి(MM.keeravani)మ్యూజిక్.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.