English | Telugu

వంగవీటి సినిమా నిర్మాత అరెస్ట్

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)అభిమానిగా గుంటూరు జిల్లా తెనాలిలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టిన దాసరి కిరణ్ కుమార్(Dasari Kirankumar)ఆ పై నిర్మాతగా మారి రామదూత క్రియేషన్స్ పై 'జీనియస్, వంగవీటి, వ్యూహం వంటి పలు సినిమాలని నిర్మించాడు.

రీసెంట్ గా దాసరి కిరణ్ పై గాజుల మహేష్(Gajula Mahesh)అనే ట్రావెల్ ఏజెన్సీ నడుపుకునే వ్యక్తి ఈ నెల 18 న విజయవాడ పడమట పిఎస్ లో ఫిర్యాదు చేసాడు. తన ఫిర్యాదులో కిరణ్ నా వద్ద రెండు సంవత్సరాల క్రితం, వ్యాపార నిమిత్తం 4.5 కోట్ల రూపాయిలు అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని నా భార్యతో పాటు విజయవాడలో ఉన్న కిరణ్ ఆఫీస్ కి వెళ్ళాను. కానీ కిరణ్ మనుషులు మమల్ని బయటకి నెట్టి వెయ్యడమే కాకుండా, దాడి చేసి గాయపరిచారని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పోలీసులు కిరణ్ ని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడ కి తరలించినట్టుగా వార్తలు వస్తున్నాయి.

వ్యూహం చిత్రంలో అవాస్తవాలని వాస్తవాలుగా చూపిస్తూ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu),ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan)చిరంజీవిని పలు రకాలుగా విమర్శించడం జరిగింది. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు.


ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.