English | Telugu

ఏంటి చిరూ మరీనూ!

సినిమా గురించి క్లారిటీ వచ్చినంత వరకూ ఓ టెన్షన్. క్లారిటీ వచ్చాక డైరెక్టర్ టెన్షన్. ఆ తర్వాత హీరోయన్ టెన్షన్. ఇదంతా ఎవరిగురించి అంటారా ఇంకెవరండీ మెగాస్టార్ చిరంజీవి సినిమా గురించే. ఇన్ని టెన్షన్స్ తర్వాత ఎట్టకేలకు పూరీ జగన్నాధ్ డైరెక్టర్ అని క్లారిటీ వచ్చింది. అప్పుడే ఫస్ట్ ఆఫ్ చిరు విన్నారు...సూపర్ అన్నారని పూరీ సంబరపడుతూ ట్వీట్ చేశాడు. ఇక చిరు బర్త్ డే నాడు ఎనౌన్స్ మెంట్ తరువాయి అని అంతా ఎదురుచూస్తున్నారు.

ఇంతలో చిరు అభిమానులకు మరో టెన్షన్ పట్టుకుంది. పూరీ కథ సిద్ధం చేస్తున్నాడంటూనే...మరోవైపు చిరు,వినాయక్ కలసి మాట్లాడుకున్నారు. అంతేనా...చిన్నికృష్ణ కథ సిద్ధం చేశాడని... ఆ కథను వినాయక్ తెరకెక్కించనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో చిరు 150 సినిమా నుంచి పూరీ అవుట్ అయి వినాయక్ వచ్చాడా? లేదా పూరీతో సినిమా తర్వాత వినాయక్ కు డేట్స్ ఇస్తాడా? ఇంతకీ చిరంజీవి 150 వసినిమా ఏ దర్శకుడితో? ఇప్పుడిదే హాట్ టాపిక్. దీనికి క్లారిటీ రావాలంటే ఆగస్ట్ 22 రావాలి మరి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.