English | Telugu

సెంటిమెంట్ ఎక్కువైంది రాజ‌మౌళీ..

బాహుబ‌లి సెన్సార్ అయిపోయింది. సినిమా ఎలా ఉండ‌బోతోంది? హైలెట్స్ ఏంటి? అనే విష‌యాల‌పై కాస్త కాస్త క్లూలు అందుతున్నాయి. ఇన్‌సైడ్ వ‌ర్గాల అభిప్రాయం ప్ర‌కారం... బాహుబ‌లిలో సెంటిమెంట్ పాళ్లు ఎక్కువ‌గా ఉన్నాయ‌ట‌. మొద‌టి 20 నిమిషాలూ భారంగా గ‌డుస్తాయని.. ఆయా సన్నివేశాల్లు రాజ‌మౌళి గుండెల్ని పిండేశాడ‌ని చెప్పుకొంటున్నారు.

బాహుబ‌లి అన‌గానే యుద్దం, వీర‌త్వం, అద్భుత‌మైన విజువ‌ల్ ఎఫైట్స్ లాంటివి ఆశించే వాళ్లంతా దాదాపు 20 నిమిషాల పాటు ఈ సెంటిమెంట్ సీన్ల‌ను భ‌రిస్తారా అనేది అనుమానంగా త‌యారైంది. అయితే ఈ సినిమా మొత్తం విజువ‌ల్ ట్రీట్ అని తెలుస్తోంది. ఇంట్ర‌వెల్ బ్యాంగ్ మొత్తం అదిరిపోయింద‌ని స‌మాచారం. దాంతో పాటు యుద్దం ఎపిసోడ్ ఈ సినిమాకి హైలెట్ అని తెలుస్తోంది.

ఇంట్ర‌వెల్‌, వార్ ఎపిసోడ్లే ఈ సినిమాని నిల‌బెట్టాయ‌ని.. మిగిలిన సినిమా అంతా ప‌క్కా రాజ‌మౌళి త‌ర‌హా రివైంజ్ డ్రామాలా సాగుతుంద‌ని టాక్‌. ఫ‌స్టాఫ్ నిడివి మొత్తం 2గంట‌ల 35 నిమిషాలు. అందులో ప‌ది నిమిషాల పాటు ట్రిమ్ చేయాల‌ని రాజ‌మౌళి డిసైడ్ అయ్యాడ‌ట‌. ఆ ప‌ది నిమిషాలూ సెంటిమెంట్ సీన్ల‌యితే.. ప్రేక్ష‌కుల‌కు భారీ రిలీఫ్ దొరికినట్టే. ఏం చేసినా జులై 10లోపే చేయాలి. ఆ త‌ర‌వాత‌... ఎన్ని హంగులు దిద్దినా, ఎన్ని ట్రిమ్మింగులు చేసినా లాభ‌మేముంటుంది?

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.