English | Telugu

ఇక సెలవు.. ముగిసిన చంద్రమోహన్‌ అంత్యక్రియలు

శనివారం మృతి చెందిన నటుడు చంద్రమోహన్‌ అంత్య క్రియలు సోమవారం జరిగాయి. అమెరికాలో స్థిరపడిన ఆయన కుమార్తె ఆదివారం రాత్రి హైదరాబాద్‌ చేరుకోవడంతో సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. 55 ఏళ్ళపాటు ప్రేక్షకులను తన నటనతో అలరించిన చంద్రమోహన్‌ తిరిగి రాని లోకాలకు తరలిపోయారు. ఫిలింనగర్‌లో మొదలైన అంతిమ యాత్ర పంజాగుట్ట శ్మశానం వరకు సాగింది. చంద్రమోహన్‌ అంతిమ సంస్కారాలను ఆయన తమ్ముడు మల్లంపల్లి దుర్గాప్రసాద్‌ నిర్వహించారు. చంద్రమోహన్‌ భౌతికకాయానికి కుటుంబసభ్యులతోపాటు వెంకటేష్‌, రాజశేఖర్‌, జీవిత, జి.ఆదిశేషగిరిరావు, మాదాల రవి అశ్రునయనాలతో నివాళులర్పించారు. చంద్రమోహన్‌ పార్థీవ దేహాన్ని హైదబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌ వద్ద కొద్దిసేపు ఉంచుతారని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలో ఎటువంటి నిజం లేదని కుటుంభ సభ్యులు తెలిపారు. చంద్రమోహన్‌ చనిపోయిన రోజే ఎంతో మంది సినీ ప్రముఖులు ఆయన నివాసం వద్దకే వచ్చి కడసారి దర్శించుకొని నివాళి అర్పించారు.

చంద్రమోహన్‌కు 2006లో బైపాస్‌ సర్జరీ జరిగింది. అప్పటి నుంచి సినిమాలు చాలావరకు తగ్గించుకున్నారు. 2017 వరకు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చాలా సినిమాల్లో నటించిన ఆయన ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. హృద్రోగంతోపాటు కిడ్నీ సమస్య కూడా తలెత్తడం వల్ల ఆయన కోలుకోలేకపోయారు. శనివారం ఉదయం స్పృహ తప్పి పడిపోయిన చంద్రమోహన్‌ను కుటుంబ సభ్యులు అపోలో హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందారని వైద్యులు ధృవీకరించారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.