English | Telugu

చలాకీ చంటికి గుండెపోటు!

ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఎందరో గుండెపోటుకి గురవుతున్నారు. పలువురు సెలబ్రిటీలు సైతం గుండెపోటు బారిన పడుతున్నారు. తాజాగా జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి గుండెపోటుతో ఆసుపత్రి పాలయ్యాడు. ఆయన తీవ్ర అస్వస్థకు గురి కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలో చికిత్స అందించిన వైద్యులు ఆయనకు స్టెంట్ వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.

బుల్లితెరపై, వెండితెరపై కమెడియన్ గా చంటి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని టీవీ షోలకు యాంకర్ గానూ వ్యవహరించారు. అలాగే బిగ్ బస్-6 లో కంటెస్టెంట్ గా అలరించాడు. అయితే ఈమధ్య అటు బుల్లితెర మీద గాని, ఇటు వెండితెర మీద గాని చంటి సందడి ఎక్కువగా కనిపించడం లేదు. ఈ క్రమంలో ఆయన గుండెపోటుతో ఆస్పత్రిపాలు కావడం అభిమానులు, సన్నిహితుల్లో ఆందోళన కలిగించింది. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పలువురు పోస్ట్ లు పెడుతున్నారు. కాగా కుటుంబసభ్యులు సకాలంలో స్పందించి, ఆస్పత్రికి తలరించడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారని.. రెండు రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశముందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.