English | Telugu

తమిళ్ సినిమాలో నాగచైతన్య..!!

తమిళంలో హిట్టైన 'వేట్టియ్' సినిమాని 'తడాఖా' గా రీమేక్ చేసి మంచి ఫలితం సాదించాడు నాగచైతన్య. ఇప్పుడు మరో రీమేక్ కు రెడీ అవుతున్నాడు. ఇటివల కోలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన 'సిగరం తోడు' చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఏటీయం దొంగతనం నేపధ్యంలో సాగిన ఈ సినిమా స్క్రీన్ ప్లే, యాక్షన్ హైలెట్ గా నిలిచింది. ఇప్పుడీ సినిమా చైతు హీరోగా తెలుగులో రీమెక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఇటివలే ఈ చిత్రం రీమేక్ హక్కులను నాగర్జున ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకున్నారని తెలిసింది. అన్నపూర్ణ బ్యానర్ లోనే ఈ చిత్రాన్ని నిర్మించాలని నాగ్ డిసైడ్ అయ్యారట. తమిళ వెర్షన్ కి దర్శకత్వం వహించిన గౌరవ్ దీనికి కూడా దర్శకత్వం వహించే అవకాశాలు వున్నయని సమాచారం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.