English | Telugu

దేవికి పిచ్చి పట్టిందా...ఐటమ్‌ సాంగ్‌ విని షాక్‌ అయిన బన్ని, సుక్కు!

సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ పెట్టడం అనే సంప్రదాయం ఇప్పటిది కాదు. ఎన్నో సంవత్సరాలుగా ఇది కొనసాగుతూనే ఉంది. గతంలో దీన్ని ఐటమ్‌ సాంగ్‌ అనేవారు, ఇప్పుడు స్పెషల్‌ సాంగ్‌ అని కలర్‌ ఇస్తున్నారు. ఏది ఏమైనా ఐటమ్‌ సాంగ్‌కి సినిమాలో ఒక స్పెషల్‌ ప్లేస్‌ ఉంటుంది. అప్పటివరకు సినిమా కథ ఒక ఫ్లోలో సీరియస్‌గా వెళుతున్నప్పుడు ఇటువంటి ఐటమ్‌ సాంగ్స్‌ ఆడియన్స్‌కి కొంత రిలీఫ్‌ని ఇస్తాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే డైరెక్టర్‌ సుకుమార్‌ తన మొదటి సినిమా నుంచి ఐటమ్‌ సాంగ్‌ను వదలడం లేదు. ఎన్టీఆర్‌తో చేసిన నాన్నకు ప్రేమతో సినిమాని మినహాయిస్తే సుకుమార్‌ డైరెక్ట్‌ చేసిన అన్ని సినిమాల్లోనూ ఐటమ్‌ సాంగ్స్‌ ఉన్నాయి. దీనికి సంబంధించి రెండు విశేషాలు ఉన్నాయి. అవేమిటంటే సుకుమార్‌ చేసిన అన్ని సినిమాలకు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాదే. రెండోది ఏమిటంటే వీరి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతి ఐటమ్‌ సాంగ్‌ సూపర్‌హిట్‌ అయ్యింది. అందుకే సుకుమార్‌, దేవి ఐటమ్‌ సాంగ్‌ విషయంలో స్పెషల్‌ కేర్‌ తీసుకుంటారు.

వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో.. అందులోనిఐటమ్‌ సాంగ్‌ కూడా అంతే పెద్ద హిట్‌ అయ్యింది. ‘ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మావ’ అంటూ సాగే ఈ పాటను కంపోజ్‌ చేసిన విధానం, దాన్ని అదే ఊపులో సింగర్‌ ఇంద్రావతి చౌహాన్‌ పాడిన తీరు, ఆ పాటకు స్క్రీన్‌ మీద సమంత పెర్‌ఫార్మెన్స్‌ తోడై బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయ్యింది. అయితే ఈ పాట పుట్టుక వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అదేమిటంటే... ‘పుష్ప’ చిత్రం కోసం ఒక ఐటమ్‌ సాంగ్‌ కావాలని దేవిని అడిగాడు సుకుమార్‌. అప్పుడు ‘ఊ అంటావా’ సాంగ్‌ను కంపోజ్‌ చేసి దర్శకనిర్మాతలకు పంపాడు. ఈ సాంగ్‌ని కంపోజ్‌ చేసినపుడే దీన్ని ఖచ్చితంగా దర్శకనిర్మాతలు రిజెక్ట్‌ చేస్తారని భావించాడు దేవి. అందుకే పాటతోపాటు ఒక నోట్‌ కూడా జతచేసి పంపాడు. ‘మీరు ఏదైతే ఆశించారో దానికి భిన్నంగా ఉండే సాంగ్‌ని పంపిస్తున్నాను. ఈ పాట విని నాకు పిచ్చి పట్టింది అనుకోవద్దు. పాటను రిజెక్ట్‌ చెయ్యొద్దు. నన్ను నమ్మి ఈ పాటను సినిమాలో పెట్టండి. తప్పకుండా పెద్ద హిట్‌ అవుతుంది’ అని తన నోట్‌లో వివరించాడట. దేవి చెప్పినట్టుగానే పాట సూపర్‌హిట్‌ అయ్యింది. మొదట ఈ పాట విన్న అల్లు అర్జున్‌, సుకుమార్‌ ఇంత స్లోగా ఉందేమిటి అనుకున్నారట. 30 సెకన్ల తర్వాత పాట ఊపందుకోవడం ఇద్దరికీ పాట నచ్చడం జరిగిపోయింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే దేవి ఊహించిన దానికంటే పెద్ద హిట్‌ అయ్యిందీ సాంగ్‌. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లోనే పుష్ప2 రాబోతోంది. మరి ఈ సినిమాలో ఎలాంటి ఐటమ్‌ సాంగ్‌ పెట్టబోతున్నారో తెలుసుకోవాలంటే పాటలు రిలీజ్‌ అయ్యే వరకు ఆగాల్సిందే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.