English | Telugu

ప్రారంభమైన ‘బుజ్జి ఇలా రా 2’

ధనరాజ్ ప్రధాన పాత్రలో.."కాసిమ్" గారి నిర్మాణ సారథ్యం లో "మై సినిమా టాకీస్" బ్యానర్ పై రోరింగ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ "బుజ్జి ఇలా రా 2" అనే సినిమా భారీగా ప్రారంభం అయ్యింది..ఈ చిత్రం 2022 లో రిలీజ్ అయిన "బుజ్జి ఇలా రా" అనే హిట్ సినిమాకి సీక్వెల్ గా రూపుదిద్దుబడుతుంది..బుజ్జి ఇలా రా సినిమా కి దర్శకత్వం మరియు ఛాయ గ్రహణం వహించిన "గరుడవేగ" అంజి నే ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు..దర్శకత్వం మీద పూర్తి దృష్టి పెట్టాలనే ఉద్దేశం తో ఈ సినిమాకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అయిన "సర్వేశ్ మురారి" గారు సినిమాటోగ్రఫీ వహిస్తున్నారని డైరెక్టర్"గరుడవేగ" అంజి గారు తెలిపారు..ఈ సినిమాకి పాటలు మరియు బ్యాక్గ్రాండ్ స్కోర్ "చరణ్ అర్జున్" సమకూర్చగా..ఎడిటింగ్ "చోటా. కె.ప్రసాద్" గారు చెయ్యనున్నారు.

ఈ సినిమా "నో లిమిట్స్" అనే ట్యాగ్ లైన్ తో రూపుదిద్దుకోబోతుంది..ఈ సినిమా లోథ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తోపాటు తండ్రి కూతుర్ల ఎమోషన్ కూడా ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుందని చిత్ర బృందం పేర్కుంది..ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూఈ సినిమా లోగో నీ ఓంకార్ గారు మరియు కెమెరామెన్ సెంథిల్ కుమార్ గారు ఆవిష్కరించారు, ఈ సినిమా కి క్లాప్ ని సాయి రాజేష్ గారు, ఫస్ట్ షాట్ డైరెక్షన్ విజయ్ కనక మేడలా , కెమెరా స్విచ్ ఆన్ సి. కళ్యాణ్ గారు చేశారు, తెలుగు సినిమా స్క్రిప్ట్ ని కోన వెంకట్ గారు , తమిళ సినిమా స్క్రిప్ట్ ని దామోదర్ ప్రసాద్ గారు దర్శక నిర్మాతలకు అందచేసారు. అందరూ అతిధులు కలిసి మోషన్ పోస్టర్ ని లంచ్ చేశారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.