English | Telugu

భగవంత్ కేసరి సినిమా సూపర్ హిట్..సెన్సార్ టాక్ 

ఇప్పుడు దసరా సెలవులతో యూత్ ఎంత హుషారుతో ఉందో బాలయ్య అభిమానులు కూడా భగవంత్ కేసరి సినిమా విషయం లో అంతే హుషారుతో ఉన్నారు. భగవంత్ కేసరి సినిమా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ నెల 19 న రిలీజ్ కాబోతుంది. ఇప్ప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ఏరియాల్లో బాలయ్య అభిమానులు బెనిఫిట్ షో టిక్కెట్ల కోసం తిరుగుతున్నారు. ఈ సినిమా పై అటు ప్రేక్షకుల్లోను, అభిమానుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి.ఇప్పుడు వాళ్ళ అంచనాలని రెట్టింపు చేసేలా సెన్సార్ వాళ్ళుసినిమా చూసిబాగుందని అన్నారు


బాలకృష్ణ తాజా చిత్రం భగవంత్ కేసరి ఈ నెల 19 న విడుదల కాబోతుంది. అలాగే మేకర్స్ కూడా సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఇటీవలే హనుమకొండ లో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ట్రైలర్ చూసిన అభిమానులు సరికొత్త బాలయ్య ని చూడబోతున్నామని ఫిక్స్ అయ్యారు. అలాగే ఇప్పుడు ఆహా లో ప్రారంభం కాబోయే అన్ స్టాపబుల్-3 లో కూడా భగవంత్ కేసరి టీం కనువిందు చేయబోతుంది. అలాగే ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని కూడా చాలా గ్రాండ్ గా చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇక అసలు విషయానికి వస్తే భగవంత్ కేసరి సినిమా ఇటీవలే సెన్సార్ ని పూర్తి చేసుకుంది .యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ వారు మూవీని ప్రశంసించడంబాలయ్య అభిమానులని ఆనందం లో ముంచెత్తుతుంది.అలాగే ఫస్ట్ ఆఫ్ లో బాలయ్య,శ్రీ లీల ల మధ్య సెంటిమెంట్ అదిరిపోయిందని సెకండ్ ఆఫ్ లో అయితే బాలయ్య గెటప్ చాలా కొత్తగా ఉందని రేపు థియేటర్స్ లో ఆ గెటప్ కి మోత మోగిపోవడం ఖాయమనిఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి.ఈ వార్తలు విన్న నందమూరి అభిమానులు జై బాలయ్య అంటూ తెలుగు ఇండస్ట్రీ లో ఇంకో రికార్డు నమోదు కాబోతుందని అంటున్నారు. ఎప్పుడెప్పుడు తెర మీద బాలయ్య ని చూస్తామా అని ఆశతో కేలండర్ లో 19 వ తారీకు కోసం ఎదురు చూస్తున్నారు. 2 గంటల 44 నిమిషాల నిడివితో సినిమా ఉండబోతుంది
.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.