English | Telugu

మూడేళ్ళకి ఒక్క సినిమా తీసేవాడు గొప్పోడా.. బెల్లంకొండ ఎవరిని టార్గెట్ చేశాడు?

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన 'కిష్కింధపురి' చిత్రం తాజాగా థియేటర్లలో అడుగుపెట్టింది. డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ బుకింగ్స్ పరవాలేదు అనే స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 'కిష్కింధపురి' టీం తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించింది. అయితే ఈ ప్రెస్ మీట్ లో బెల్లంకొండ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. మూడేళ్ళకి ఒక్క సినిమా తీసేవాడు గొప్పోడా? ఏడాదికి మూడు సినిమాలు తీసేవాడు గొప్పోడా? అంటూ బెల్లంకొండ సంచలన వ్యాఖ్యలు చేశాడు. (Kishkindhapuri)

ప్రెస్ మీట్ లో బెల్లంకొండ మాట్లాడుతూ.. "కిష్కింధపురికి వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉంది. మూడు ప్రీమియర్ షోలు వేద్దామనుకున్నాం.. కానీ 66 షోలు పడ్డాయి. ఎక్కడికెళ్ళైనా హౌస్ ఫుల్స్. ఆర్గానిక్ గా మా సినిమా ఆడియన్స్ లోకి రీచ్ అయింది. మేము చాలా జెన్యూన్ గా, ఆర్గానిక్ గా ప్రేమను సంపాదించాం. తెలుగు ప్రేక్షకుల్లాంటి గొప్పోళ్ళు ఈ భూమ్మీద లేరు. ఎందుకంటే, వాళ్ళు గొప్ప సినిమాని కాపాడతారు. మా చిన్న సినిమాని కాపాడాలని కోరుకుంటున్నాను. అసలు నిన్న మార్నింగ్ నుంచే 'కిష్కింధపురి' వచ్చి ఉండుంటే.. వేరేలా ఉండేది. లేట్ అయినా పర్లేదు.. సినిమా మంచి రేంజ్ కి వెళ్తుంది. ఇది క్రిటిక్స్ ని ఒప్పించేంత గొప్ప సినిమా కాకపోవచ్చు.. కానీ, ప్రేక్షకులను మెప్పించేంత గొప్ప సినిమా." అన్నాడు. (Bellamkonda Sreenivas)

అయితే, బెల్లంకొండ తన స్పీచ్ లో "జెన్యూన్ గా, ఆర్గానిక్ గా మేము ఆడియన్స్ ప్రేమను పొందాం" అని నొక్కి చెప్పడం చూస్తుంటే.. తమ సినిమాకి పోటీగా విడుదలైన 'మిరాయ్'పై పరోక్ష వ్యాఖ్యలు చేశాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అలాగే బెల్లంకొండ మరోసారి మైక్ అందుకొని.. మీడియా సపోర్ట్ బాగుందని అన్నాడు. మంచి సినిమాని ఇలాగే సపోర్ట్ చేస్తే, అందరం బాగుంటామని చెప్పాడు. అంతటితో ఆగకుండా.. "ఒక సంవత్సరానికి మూడు సినిమాలతో వచ్చే హీరో గొప్పోడా? మూడేళ్లకు ఒక సినిమాతో వచ్చేవాడు గొప్పోడా?" అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం బెల్లంకొండ కామెంట్స్ వైరల్ గా మారాయి. ఎవరైనా హీరోని టార్గెట్ చేసి ఈ కామెంట్స్ చేశాడా? లేక కేవలం వేగంగా సినిమాలు చేస్తే ఇండస్ట్రీకి మంచిదని చెప్పే ప్రయత్నం చేశాడా? అంటూ చర్చ జరుగుతోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.