English | Telugu

'తుంగభద్ర'ను చూసిన బాలయ్య

రాజకీయాలు, సినిమాలతో బిజీగా గడుపుతున్న నందమూరి బాలయ్యకు కొంచెం ఖాళీ సమయం దొరకడంతో సినిమా చూడాలని డిసైడ్ అయ్యారట. తన లెజెండ్ ప్రొడ్యూసర్ సాయి కొర్రపాటి నిర్మించిన 'తుంగభద్ర' సినిమా కథ నచ్చడంతో తాను ఫ్యామిలీతో సహా చూస్తానని అన్నారట. దీంతో ఆయన బాలయ్య కోసం ప్రత్యేకంగా షో అరేంజ్ చేసారట. సినిమా చూసిన బాలయ్య, టేకింగ్ ను, కొత్త దర్శకుడిని తెగ మెచ్చుకున్నారట. మంచి సినిమాను నిర్మించావని నిర్మాత సాయి కొర్రపాటిని తెగ పొగిడేశారట. బాలయ్య అంతటి వాడు కితాబు ఇచ్చేసరికి సాయి కొర్రపాటి సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ గా వున్నాడట. ఈ సినిమా ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దం చేస్తున్నాడు.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.