English | Telugu

బాల‌య్య సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యం

నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌బోతున్నారా?? ఇక పూర్తిగా రాజ‌కీయాల‌కే త‌న జీవితాన్ని అంకితం చేయ‌బోతున్నారా?? ప‌రిస్థితి చూస్తే అలానే అనిపిస్తోంది. బాల‌య్య వందో సినిమాకి ద‌గ్గ‌ర ప‌డుతున్నారు. సెంచ‌రీ మైలురాయిని అందుకోగానే బాల‌య్య సినిమాల‌కు దూర‌మ‌వుతార‌ని టాక్‌. ప్ర‌స్తుతం ఆయ‌న 99వ చిత్రంగా డిక్టేట‌ర్‌ని చేస్తున్నారు. ఆ త‌ర‌వాత బోయ‌పాటితో వందో సినిమా ఉంటుంది. సెంచ‌రీ కొట్టాక‌... ఆయ‌న రాజకీయాల‌కే ప‌రిమిత‌మ‌య్యే సూచ‌న‌లు ఉన్నాయ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ స‌మాచారం. బాల‌య్య మూడ్ పూర్తిగా పోలిటిక్స్‌పై ఉంద‌ని, ఆయ‌న సినిమాల‌పై దృష్టి పెట్ట‌లేక‌పోతున్నార‌ని ఆయ‌న కాంపౌండ్ వ‌ర్గాలే చెబుతున్నాయి. బాల‌య్య 99వ సినిమా డిక్టేట‌ర్ లాంఛ‌నంగా ప్రారంభ‌మై నెల‌రోజులైంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ షూటింగ్ మొద‌లవ్వ‌లేదు. ఆంధ్ర రాష్ట్రంలో రాజ‌కీయాలు వేడి వేడిగా న‌డుస్తున్న ఈ నేప‌థ్యంలో తాను సినిమాల‌పై దృష్టి పెట్ట‌లేన‌ని బాల‌య్య చెబుతున్నార‌ట‌. అభిమానుల కోరికపై వంద సినిమాలుచేసి.. ఆ త‌దుప‌రి బాధ్య‌త వార‌సుడు మోక్ష‌జ్ఞ‌కి అందివ్వాల‌ని బాల‌య్య డిసైడ్ అయ్యార‌ట‌. చేతిలో ఉన్న రెండు సినిమాలు పూర్త‌య్యే స‌రికి క‌నీసం రెండేళ్ల‌యినా అవుతుంది. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ ఎన్నిక‌లొస్తాయి. ఈసారి బాల‌య్య‌కు మంత్రివ‌ర్గంలో స్థానం దాదాపుగా ఖాయ‌మైన నేప‌థ్యంలో బాల‌య్య‌... ఇక‌పై పూర్తిస్థాయి రాజ‌కీయ నాయ‌కుడిగా చ‌లామ‌ణి అవ్వ‌డానికే మొగ్గు చూపుతార‌ని టాక్‌. అదే నిజ‌మైతే బాల‌య్య ఫ్యాన్స్ డీలా ప‌డ‌క త‌ప్ప‌దు.

త‌మ అభిమాన హీరోని మోక్ష‌జ్ఞ రూపంలో చూసుకొని త‌రించ‌డం మినహా మ‌రో మార్గం లేదు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.