English | Telugu

బాహుబ‌లికి 'వందే'సిన జక్క‌న్న‌

మా సినిమా ఇంత వ‌సూలు చేస్తుంది, ఇన్ని రికార్డులు బ‌ద్ద‌లు కొడుతుంది.. అంటూ ముందే లెక్క‌లు బ‌య‌ట‌పెట్ట‌డానికి చాలా ధైర్యం, త‌మ సినిమాపై బోల్డంత న‌మ్మ‌కం కావాలి. సినిమాని ఓ య‌జ్ఞంలా భావించి, ఆహోరాత్రులు క‌ష్ట‌ప‌డి, త‌న క‌థ‌ని వెండితెర‌పై రంగుల హ‌రివిల్లులా ఆవిష్క‌రించే రాజ‌మౌళి మాత్రం ఎప్పుడూ గొప్ప‌లు పోలేదు. మంచి సినిమా తీశాం.... చూడండి అంటాడంతే. అయితే తొలిసారి రాజ‌మౌళి త‌న సినిమా సాధించే రికార్డుల గురించి క‌ల‌లుకంటున్నాడు. బాహాటంగానే చెప్పేస్తున్నాడు. ''బాహుబ‌లి తెలుగులో వంద కోట్లు సాధించి తీరుతుంది'' అంటూ ఓ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చి... అంద‌రికీ షాక్ ఇచ్చాడు రాజ‌మౌళి. బాహుబ‌లి సినిమా ఎంత వ‌సూలు చేస్తుంది? అంటూ ఓ ఇంట‌ర్వ్యూలో ఎదురైన ప్ర‌శ్న‌కు రాజ‌మౌళి ఇలా స్పందించాల్సివ‌చ్చింది. సాధార‌ణంగా ఇలాంటి విష‌యాల్ని బ‌య‌ట‌చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డని రాజ‌మౌళి 'వంద కోట్లు ఖాయం' అనేస‌రికి... చిత్ర‌సీమ షాక్ తింది. రాజ‌మౌళి న‌మ్మ‌కానికి ఓ భారీ రీజ‌న్ ఉంది లెండి. బాహుబ‌లి సినిమాని తెలుగు రాష్ట్ర్రాల్లో ఏకంగా రెండు వేల థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నారు. అనుకొన్న ప్లాన్ ప్ర‌కారం.. అన్నీ వ‌ర్క‌వుట్ అయితే.. తొలి మూడు రోజుల్లోనే రూ.50 కోట్ల‌కు పైనే వ‌సూళ్లు రాబ‌ట్టే అవ‌కాశం ఉంది. రాజ‌మౌళి ధీమా అదే! అదే జోరు తొలివారం కొన‌సాగితే.. బాహుబ‌లి వంద చేరు కోవ‌డం ఖాయం.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.