English | Telugu

బాలయ్య, పవన్ మధ్య బాక్సాఫీస్ వార్.. ఏ సినిమాలో తెలుసా..?

సెప్టెంబర్ 25న 'అఖండ-2'తో బాలకృష్ణ, 'ఓజీ'తో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర తలపడాల్సి ఉండగా.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కారణంగా 'అఖండ-2' వాయిదా పడింది. దీంతో బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ ఫైట్ మిస్ అయింది. అయితే, సెప్టెంబర్ కి మిస్ అయిన వీరి పోరు.. డిసెంబర్ లో ఉండే అవకాశం కనిపిస్తోంది. (Balakrishna vs Pawan Kalyan)

'అఖండ-2'ని డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే టైంలో పవన్ కళ్యాణ్ సినిమా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఆ సినిమా ఏదో కాదు.. 'ఉస్తాద్ భగత్ సింగ్'. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీని.. డిసెంబర్ మొదటి వారంలోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో 'అఖండ-2'పై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. మరోవైపు 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న ఫిల్మ్ కావడంతో 'ఉస్తాద్ భగత్ సింగ్'పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అలాంటిది ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగితే.. పోరు ఆసక్తికరంగా ఉంటుంది అనడంలో డౌట్ లేదు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.