English | Telugu

బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దిశగా 'భగవంత్ కేసరి'

నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. బాలయ్య గత చిత్రాలు 'అఖండ', 'వీరసింహారెడ్డి' ఘన విజయాలను సాధించగా.. ఆయన తాజా చిత్రం 'భగవంత్ కేసరి' ఆ రెండు చిత్రాలను మించిన విజయం దిశగా దూసుకుపోతోంది.

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ నిర్మించిన సినిమా 'భగవంత్ కేసరి'. దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని.. భారీ వసూళ్ళతో బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. ప్రొడ్యూసర్ లెక్కల ప్రకారం ఈ సినిమా వారం రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.112 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఎనిమిది రోజుల్లో దాదాపు రూ.120 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఈ వీకెండ్ లో చెప్పుకోదగ్గ సినిమాల విడుదల లేకపోవడంతో.. 'భగవంత్ కేసరి' జోరుకి బ్రేక్ లు పడేలా లేవు. త్వరలోనే రూ.150 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరేలా ఉంది.

బాలయ్య కెరీర్ లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమాలుగా 'అఖండ', 'వీరసింహారెడ్డి' నిలిచాయి. ఈ రెండు సినిమాలు కూడా రూ.130 కోట్ల రేంజ్ లో గ్రాస్ రాబట్టాయి. ప్రస్తుతం 'భగవంత్ కేసరి' జోరు చూస్తుంటే త్వరలోనే బాలయ్య కెరీర్ లో అత్యధిక వసూళ్ళు రాబట్టిన సినిమాగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.