English | Telugu

పారితోషికంతో సంచ‌ల‌నం సృష్టించిన ప్ర‌భాస్‌



అంద‌రి నోటా.. బాహుబ‌లి మాటే. బాహుబ‌లి బ‌డ్జెట్ ఇంత‌, అంత అని లెక్క‌లు ఘ‌నంగా చెప్పుకొంటున్నారు. మ‌రి.. పారితోషికాల మాటేంటి? రాజ‌మౌళి ఎంత పారితోషికం తీసుకొన్నాడు? ప్ర‌భాస్ కి ఎంతిచ్చారు? అనే విష‌యాల్ని మాత్రం చిత్ర‌బృందం బ‌య‌ట‌కు చెప్ప‌డానికి నిరాక‌రిస్తోంది. అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం... ప్ర‌భాస్ పారితోషికం విష‌యం కాస్త లీక్ అయ్యింది.

ప్ర‌భాస్‌కి ఈసినిమా కోసం రూ.25 కోట్లు అప్ప‌గించార‌ట‌. అదీ.. రెండు ద‌ఫాలుగా. తొలుత ప్ర‌భాస్‌కి రూ.18 కోట్ల పారితోషికం ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకొన్నార‌ట‌. అయితే.. ఈ సినిమాకి రెండున్న‌రేళ్లు కేటాయించ‌డం వ‌ల్ల‌.. ఇంకో రూ.7 కోట్లు ఇవ్వాల‌ని నిర్మాత‌లు భావించి.. షూటింగ్ చివ‌రి రోజున ఆ మొత్తాన్ని ఒకేసారి ముట్ట‌జెప్పిన‌ట్టు స‌మాచారం. ప్ర‌భాస్ `వ‌ద్దు.. వ‌ద్దు..` అన్నా నిర్మాత‌లు బ‌ల‌వంతంగా చేతిలో పెట్టార‌ని తెలుస్తోంది. ప్ర‌భాస్ ప‌డిన క‌ష్టం అంత‌టిది మ‌రి. ప్ర‌భాస్‌కే రూ.25 కోట్లు ఇచ్చారంటే మ‌రి బాహుబ‌లి రూప‌శిల్పికి.. జ‌క్క‌న్న‌కు ఎంతివ్వాలో..??

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.