English | Telugu

రాజమౌళిపై మీడియాకి కోపమొచ్చింది

'బాహుబలి' దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డపై మీడియా మిత్రులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. దీనికి కారణం వారు చూపిస్తున్న వివక్షేనట. తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి చిత్రం 'జూలై 10' న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా ప్రచారం కోసం వారు ప్రత్యేకంగా కొన్ని మీడియా, పత్రికలకే ఇంటర్వ్యూ లు చేసే అవకాశం కల్పించడం, మిగిలిన వారిని పట్టించుకోకపోవడంతో వారు మండిపడుతున్నారు. తమని చిన్న చూపు చూడటమెంటని మీడియా మిత్రులు రాజమౌళిని ప్రశ్నించగా షెడ్యూల్స్ ప్రకారం ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తున్నామని చెప్పారట. మరి మాకు ఎప్పుడిస్తారని వారు డైరెక్ట్ గా ప్రశ్నించగా రాజమౌళి మాట దాటేశారట. దీంతో బాహుబలి టీమ్ చూపిస్తున్న వివక్షతకు సదరు మీడియా సోదరులు ఆగ్రహంతో ఊగిపోతున్నారట. ఈ కారణం వల్ల వారు ఈ రోజు పెట్టిన ప్రెస్ మీట్ కూడా త్వరగా ముగించారట. 'బాహుబలి' రిలీజ్ దగ్గర సమయంలో ఇలా మీడియా సోదరుల ఆగ్రహానికి గురి కావడం అంత మంచిది కాదని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయట.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.