English | Telugu

'బాహుబలి' vs 'భజరంగీ భాయ్ జాన్'.. గెలుపెవరిది

ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ముఖ్యంగా రెండు సినిమాల గురించి చర్చలు బాగా జరుగుతున్నాయి. అవి 'బాహుబలి' ఒకటి.. ఇంకొకటి భజరంగీ భాయ్ జాన్. విచిత్రం ఏంటంటే ఈ రెండు సినిమాలకు స్టోరీ రైటర్ ఒకరే.. అది జక్కన్న రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. ఇప్పుడు ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్దు కాసుల వర్షం కురుస్తున్నాయి. ఇంతవరకూ పెద్దగా రాజమౌళి తండ్రి గురించి కొంత మందికి తెలిసినా.. ఇప్పుడు ఈ రెండు సినిమాలతో ఒక్కసారిగా పెద్ద సెలబ్రిటీ అయిపోయారు. అయితే ఇప్పుడు ఈ 'బాహుబలి' vs 'భజరంగీ భాయ్ జాన్' లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టయ్యింది అని సినీ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన 'బాహుబలి' మొదటి ఆరు రోజుల్లో 285 కోట్లు సాధించగా 'భజరంగీ భాయీజాన్‌' 169 కోట్లు సాధించింది. ట్రేడ్ అనలిస్ట్ తరన్ ఆదర్శ్ కూడా ఈ విషయాన్ని తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో ఎవ్వ‌రిది పైచేయిగా నిలుస్తుందా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. మొత్తానికి 'బాహుబలి', 'భజరంగీ భాయీజాన్‌' మూవీల మధ్య పోటీ గట్టిగానే ఉందని సినీ విశ్లోషకులు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్టవుతుందో తెలియదు కానీ.. ఈ సినిమాల వల్ల విజయేంద్ర ప్రసాద్ సూపర్ హిట్టయ్యాడని మాత్రం తెలుస్తోంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.