English | Telugu

సెప్టంబర్ 4న 'రుద్రమదేవి'

ఎట్టకేలకు దర్సకుడు గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'రుద్రమదేవి' సినిమా రిలీజ్ డేట్ ప్రకటించాడు. అసలు ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ మధ్యలో కొన్ని ఆర్ధిక ఇబ్బందులు.. దానికి తోడు బాహుబలి సినిమా కూడా విడుదలయ్యేసరికి 'రుద్రమదేవి సినిమా రిలీజ్ డైలమాలో పడింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేయాలని గుణశేఖర్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సెప్టంబర్ 4వ తేదీన 'రుద్రమదేవి' చిత్రాన్ని భారి ఎత్తున విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే మొదట తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో విడుదల చేస్తామని తెలిపారు. హిందీలో ఎప్పుడు విడుదల చేస్తారన్నది మాత్రం చెప్పలేదు. ఈ చిత్రంలో ముఖ్య పాత్రలో అనుష్క, రానా, అల్లు అర్జున్ నటించారు. 'రుద్రమదేవి' తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డీ చిత్రం కావడం విశేషం. ఇప్పటికే బాహుబలి సినిమాతో ప్రేక్షకులు ఫుల్లు హ్యాపీతో ఉన్నారు... ఇక రుద్రమదేవి కూడా వచ్చిందంటే అభిమానులకు ఫుల్లు ఫీస్టే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.