English | Telugu

'బాహుబలి ది ఎపిక్' యూఎస్ రివ్యూ.. ఇలా ఉందేంటి పరిస్థితి?

- ప్రేక్షకుల ముందుకు 'బాహుబలి ది ఎపిక్'
- యూఎస్ ప్రీమియర్ టాక్ ఏంటి?
- వంద కోట్ల గ్రాస్ సాధ్యమేనా?

తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్ళిన చిత్రం బాహుబలి. రెండు భాగాలుగా విడుదలైన ఈ చిత్రం ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇప్పుడు రెండు భాగాలు కలిపి 'బాహుబలి ది ఎపిక్' పేరుతో ఒక సినిమాగా రీ-రిలీజ్ అవుతోంది. ఇండియాలో అక్టోబర్ 31న విడుదలవుతుండగా.. ఓవర్సీసీ లో ఇప్పటికే ప్రీమియర్స్ పడ్డాయి. (Baahubali The Epic)

బాహుబలి రెండు భాగాలు కలిపి దాదాపు ఐదున్నర గంటల నిడివి. దానిని ఏకంగా 3 గంటల 45 నిమిషాలకు కుదించడంతో 'బాహుబలి ది ఎపిక్'పై అందరిలో ఆసక్తి కలిగింది. ఇప్పుడు ఆ ఆసక్తిని రెట్టింపు చేస్తూ.. యూఎస్ ప్రీమియర్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇది రీ-రిలీజ్ లా లేదని ఒక కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందని అంటున్నారు.

ప్రభాస్-తమన్నా లవ్ సీన్స్, కొన్ని సాంగ్స్, కొన్ని యాక్షన్ సీన్స్ ని ట్రిమ్ చేయడంతో.. సినిమా వేగంగా పరుగెత్తింది. అలా అని స్టోరీ సోల్ కానీ, ఎమోషన్ కానీ ఎక్కడా మిస్ అవ్వలేదు. ప్రేక్షకులను కథలో మరింత ఇన్వాల్వ్ చేయడం కోసం.. అక్కడక్కడా వాయిస్ ఓవర్ జోడించడం కూడా బాగుందని చెబుతున్నారు. ప్రధాన పాత్రల మధ్య డ్రామాని బిల్డ్ చేస్తూ, కథనాన్ని ఆసక్తికరంగా నడిపిస్తూ.. ఎడిట్ చేసిన విధానానికి హ్యాట్సాఫ్ అంటున్నారు.

Also Read: అప్పుల్లో దర్శకధీరుడు రాజమౌళి..?

బాహుబలి వచ్చి పదేళ్లు అవుతుంది. ఇప్పటికే చాలాసార్లు చూసుంటాం. అయినప్పటికీ 'బాహుబలి ది ఎపిక్' ఓ కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తూ, థ్రిల్ ని పంచుతుందని.. ఇది ఖచ్చితంగా మరోసారి బిగ్ స్క్రీన్ పై చూసి ఆస్వాదించాల్సిన చిత్రమని.. ప్రీమియర్స్ చూసిన వారంతా చెబుతుండటం విశేషం.

రీ-రిలీజ్ లో రూ.100 కోట్ల గ్రాస్ రాబట్టిన మొట్టమొదటి సినిమాగా 'బాహుబలి' నిలుస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. అసలే ప్రేక్షకులు 'బాహుబలి ది ఎపిక్' కోసం ఓ కొత్త సినిమాలా ఎదురుచూస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కి కూడా మంచి స్పందన వస్తోంది. ఇక ఇప్పుడు ఓవర్సీస్ ప్రీమియర్స్ టాక్ ఓ రేంజ్ లో ఉంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. వంద కోట్లు ఏంటి, అంతకుమించి వసూళ్ళు రాబట్టినా ఆశ్చర్యంలేదు అనిపిస్తోంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.