English | Telugu

నాన్నా రాజమౌళి.. ప్రభాస్ ని ఇలా ఎప్పుడూ చూసుండరు!

- బాహుబలి రీ రిలీజ్ సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ
- ప్రోమోలో నవ్వులు పూయించిన బాహుబలి త్రయం

అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు.. అద్భుతం జరిగాక ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు. అలాంటి అద్భుతాన్ని 'బాహుబలి' రూపంలో టాలీవుడ్ చూసింది. అయితే ఆ అద్భుతం వెనుక.. మనకి తెలియని మరెన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి.

తెలుగు సినిమాని ప్రపంచస్థాయికి తీసుకెళ్ళిన చిత్రం 'బాహుబలి' అనడంలో ఎటువంటి సందేహం లేదు. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా.. ఇండియన్ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు రెండు భాగాలూ కలిపి ఒకటే సినిమాగా 'బాహుబలి: ది ఎపిక్' పేరుతో అక్టోబర్ 31న థియేటర్లలో అడుగుపెడుతోంది. (Baahubali: The Epic)

'బాహుబలి' రీ రిలీజ్ సందర్భంగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళితో కలిసి ప్రభాస్, రానా సందడి చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇందులో షూటింగ్ నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

"బాహుబలిని కట్టప్ప ఎప్పుడు చంపాలి అనే దానికంటే.. ఆ నిర్ణయానికి కట్టప్ప ఎప్పుడు వస్తాడు?" అనే పాయింట్ దగ్గరే తాను ఆగిపోయినట్లు రాజమౌళి చెప్పుకొచ్చాడు. "నాన్నా రాజమౌళి.. ప్లీజ్ అది వేయండి" అంటూ ఒక విషయంలో రాజమౌళిని ప్రభాస్ రిక్వెస్ట్ చేయడం సరదాగా ఉంది. "కిరీటం మీద చేయి పెట్టి మాట్లాడిన రోజే.. అది నా కింగ్డమ్ అని ఫిక్స్ అయిపోయాను" అంటూ భల్లాలదేవ పాత్రను తాను ఎంతలా ఓన్ చేసుకున్నది రానా తెలిపాడు.

మొత్తానికి కొన్ని జ్ఞాపకాలు, కొన్ని నవ్వులతో ఈ ఇంటర్వ్యూ ప్రోమో భలే ఉంది. పూర్తి ఇంటర్వ్యూ త్వరలోనే విడుదల కానుంది.

Also Read: స్టార్ కిడ్ చేతికి విజయ్ దేవరకొండ భారీ ప్రాజెక్ట్..!

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.