English | Telugu

వివాదంలో హైపర్ ఆది.. క్షమాపణలు చెప్పాలని ఫ్యాన్స్ డిమాండ్

- నవ్వించే వాడు యోగి
- వివాదంలో హైపర్ ఆది
- ప్రముఖ నటిపై బాడీ షేమింగ్ కామెంట్స్
- దీపికా రంగరాజు ఫ్యాన్స్ ఆగ్రహం

నవ్వేవాడు బోగి, నవ్వించే వాడు యోగి అనేది పెద్దలు చెప్పిన సామెత. ఆ సామెత ప్రకారం తనదైన మాటల ప్రాసలతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలని నవ్విస్తు వస్తున్నాడు హైపర్ ఆది(Hyper Aadi). మరి ఈ లెక్కన ఆది ని కూడా యోగిగా భావించవచ్చు. ఆది ఒక ప్రోగ్రాం చేసినా గెస్ట్ గా వెళ్లినా సదరు ప్రోగ్రాంని ఆది కోసం చూసే వాళ్ళు ఎందరో. సిల్వర్ స్క్రీన్ పైకి కూడా అడుగుపెట్టి రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ల 'కిష్కిందపురి' తో అలరించాడు.

ఆది ప్రముఖ టెలివిజన్ ఛానల్ ఈటీవీ(EtV)లో ప్రసారమవుతున్నశ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ డాన్స్ షో ప్రోగ్రాంలకి గెస్ట్ గా వెళ్తున్న విషయం తెలిసిందే. తోటి కంటెస్టెంట్స్ పై ఆది చేసే జోక్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. దీంతో ఆది పంచే ఎంటర్ టైన్ మెంట్ తో సదరు షోస్ కి స్పెషల్ ఎట్రాక్షన్ కూడా వచ్చింది. రీసెంట్ గా ఢీ డ్యాన్స్ షో కి సంబందించిన ప్రోమో ని నిర్వాహకులు రిలీజ్ చేశారు. సదరు ప్రోమోలో బ్రహ్మముడి సీరియల్ నటి కావ్య, కెమెరా‌మాన్ తో డ్యాన్స్ చేసిన వీడియో రిలీజయ్యింది. ఆది ఆ ఇద్దరిని ఉద్దేశించి మాట్లాడుతు మీరు పర్మిషన్ ఇస్తే నేను డైరెక్టర్‌గా 'గుండు అంకుల్ బండ ఆంటీ’ అని ఒక సినిమా తెరకెక్కిస్తాని అన్నాడు. ఆ మాటలకి ఇబ్బంది పడినట్టుగానే కావ్య ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.

Also Read: మమిత భైజు దెబ్బకి పూజాహెగ్డే విలవిల

ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆది బాడీ షేమింగ్ కామెంట్స్ చెయ్యడం కరెక్ట్ కాదు కావ్య కి సారీ చెప్పి ఆది తన వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు కోరుతున్నారు. కావ్య అసలు పేరు దీపికా రంగరాజు(Deepika Rangaraju)కావ్యరోల్ లో అద్భుతమైన పెర్ఫార్మ్ ని ప్రదర్శిస్తు అశేష అభిమానులని సంపాదించుకుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.