English | Telugu

క్షమాపణలు చెప్పిన 'బాహుబలి' రైటర్


సాధారణంగా సినిమాలో కొన్ని డైలాగ్స్ కి మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కొంతమంది హడావిడి చేస్తుంటారు. అది కామన్ థింగ్. పాపం ఇప్పుడు ఆ చిక్కు 'బాహుబలి' సినిమాకు కూడా వచ్చింది. దర్శకమౌళి రాజమౌళి తీసిన బాహుబలి చిత్రం పలు బాషల్లో విడుదలయి రికార్డులు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ చిత్రం తమిళ వెర్షన్ లో ఉన్న వాడిన కొన్ని పదాలు దళితులను కించపరిచేలా ఉన్నాయని వివాదం రేగింది. ఈ సినిమాలో వాడిన ‘pagadai' అనే పదం దళితులలో ఓ వర్గాన్ని కించ పరిచేలా ఉందని వెంటనే ఆ పదాన్ని తీసేయాలంటూ ఆందోళన చేశారు. దీంతో తమిళవెర్షన్ లో డైలాగ్స్ రాసిన మదన్ కార్కే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు తెలిపాడు. తాను రాసిన పదం వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే క్షమించండంటూ.. అసలు అది ఓ కమ్యూనిటికి చెందిన పదమని కూడా తెలియదని.. వెంటనే సినిమాలో నుండి ఆ పదాన్ని తీసేస్తున్నా అని చెప్పారు. పాపం ఆఖరికి 'బాహుబలి'కి కూడా సినిమాకష్టాలు తప్పలేదు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.