English | Telugu

ఆటోనగర్ సూర్య విడుదల కన్‌ఫర్మ్ చేసిన రాజమౌళి


నాగచైతన్య నటించిన 'ఆటోనగర్‌ సూర్య' చిత్రం ఎన్నో ఒడిదుడుకుల తర్వాత జూన్ 27న విడుదల తేదీని ప్రకటించింది. కానీ ఆ విడుదల ఆపాలంటూ కోర్టులో కేసు నమోదు అయ్యింది. జులై 10వ తేదీ వరకు చిత్ర విడుదలను నిలిపివేయాలని గుంటూరు కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే ఇప్పటికే ఎంతో ఆలస్యమైన ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చెయ్యాలని నిర్మాతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపే ఆటోనగర్ సూర్య చిత్రం విడుదల కానుంది, డైరెక్టర్ దేవకట్టా అండ్ టీంకు ఆల్ ద బెస్ట్ అంటూ ఫేస్‌బుక్ లో విష్ చేశారు రాజమౌళి.
అలాగే ఈ చిత్రానికి సంబంధించిన థియేటర్ విడుదల వివరాలు కూడా వెబ్ మీడియాలో ప్రచారంలోకి వచ్చాయి. రేపే ఆటోనగర్ సూర్య విడుదల అంటూ పోస్టర్లు కూడా దర్శనమిస్తున్నాయి.
దీనిని బట్టి చూస్తే, కోర్టు ఉత్తర్వులు విడుదలకు అనుకూలంగానే వచ్చి వుండవచ్చని తెలుస్తోంది. ఈ చిత్రం విడుదలకు సంబంధించిన కేసు బుధవారం విచారణకు వచ్చిన సంగతి తెలిసిందే.


పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.