English | Telugu

మరో ఫ్లాప్ దర్శకుడికి అవకాశం ఇచ్చిన మెగాస్టార్!

మెగాస్టార్ రీఎంట్రీలో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలలో వాల్తేరు వీరయ్య చిత్రం బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి ఓకే అనిపించాయి. ఆచార్య డిజాస్టర్ అయింది. గాడ్ ఫాదర్ పర్వాలేదు అనిపించింది. వాల్తేరు వీరయ్య మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మెగాస్టార్ ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్న దర్శకుడు మెహర్ రమేష్ తో 'భోళా శంకర్' చేస్తున్నారు. అలాగే చిరు, పూరి జగన్నాథ్ కు స్టోరీ రెడీ చేయమని చెప్పారు. ఇక ఈయ‌న లిస్ట్‌లో త్రినాథ‌రావు న‌క్కిన‌, మారుతి, క‌ళ్యాణ్ కృష్ణ వంటి ద‌ర్శ‌కులు ఉన్నారు. కృష్ణ‌వంశీకి కూడ చిరు ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. మరోవైపు ఆయన ఓ తమిళ దర్శకునితో నటిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. తెలుగు హీరో, త‌మిళ ద‌ర్శ‌కుడు అనే ఫార్ములాను ప్ర‌య‌త్నించాల‌ని భావిస్తున్నారు. మ‌రి ఇది ఏమైనా పాన్ ఇండియా మూవీనా లేక తెలుగు, త‌మిళంలో రూపొందే ద్విబాషా చిత్ర‌మా? లేక కేవ‌లం తెలుగుకే ప‌రిమిత‌మా? అనేది తెలియాల్సి వుంది.

ఇక పని చేయాలనుకుంటున్న ఆ తమిళ ద‌ర్శ‌కుడు మ‌రెవ్వ‌రో కాదు. చిరు బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఠాగూర్ ఒరిజిన‌ల్ వెర్ష‌న్ ర‌మ‌ణ తీసిన మురుగ‌దాస్. అలాగే ఆయన దర్శకత్వంలో చిరంజీవి ఇప్పటికే స్టాలిన్ అనే చిత్రం చేశారు. అయితే ఈ చిత్రం అనుకున్న స్థాయిలో హిట్ కాలేదు. ఇక మురుగ‌దాస్ దర్శకత్వంలో వచ్చిన తమిళ్ మూవీ కత్తి కి రీమేక్ గా రూపొందిన 'ఖైదీ నెంబర్ 150' తోనే చిరు రీఎంట్రీ ఇచ్చారు. ఇలా చిరు నటించిన మూడు చిత్రాలలో మురుగ‌దాస్ ప్ర‌మేయం ఉంది.

తాజాగా చిరు నేరుగా మురుగదాసుతోనే స్టాలిన్ తర్వాత రెండో చిత్రం చేయాలని యోచిస్తున్నార‌ట. అయితే ప్రస్తుతం మురుగదాస్ వ‌రుస ఫ్లాప్స్ లో ఉన్నారు. ఆయ‌న‌కు గ‌జిని సీక్వెల్ చేద్దామ‌ని అమీర్ ఖాన్ ఆఫ‌ర్ ఇచ్చాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. మ‌రోవైపు మురుగ‌దాస్ కోలీవుడ్ యంగ్ స్టార్ శివ‌కార్తికేయ‌న్ హీరోగా ఓ చిత్రం చేయాల‌ని భావిస్తున్నారు. అయితే శివ‌కార్తికేయ‌న్ ప్ర‌స్తుతం మూడు చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. శివ‌కార్తికేయ‌న్ వెంట‌నే లైన్ లోకి వ‌స్తే ముందుగా శివ‌కార్తికేయ‌న్ చిత్రాన్ని మురుగ‌దాస్ పూర్తిచేస్తాడు. ఆ త‌ర్వాత చిరుతో చేస్తారు. శివ‌కార్తికేయ‌న్ సినిమా లేట్ అవుతుంద‌ని భావిస్తే మాత్రం మురుగ‌దాస్ వెంట‌నే చిరుతో చిత్రం చేయ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.