English | Telugu

సూర్య‌తో అనుష్క మాలీవుడ్ ఎంట్రీ

తెలుగులో స్టార్ హీరోయిన్‌గా త‌న‌దైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అనుష్క శెట్టి త‌మిళంలో కొన్ని సినిమాలు చేసింది. ఎక్కువ ఫోక‌స్ తెలుగు సినిమాపైనే పెట్టింది. ఇత‌ర భాష‌ల్లో ఆమె న‌టించలేదు. అయితే ఎట్ట‌కేల‌కు ఇప్పుడామె మ‌ల‌యాళ చిత్ర‌సీమ‌లోకి అడుగు పెట్ట‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. వివ‌రాల్లోకి వెళితే, జై సూర్య‌తో హోమ్ మూవీ ఫేమ్ రోజీ థామ‌స్ ఓ సినిమా చేస్తున్నారు. అది కూడా పీరియాడిక్ మూవీ. ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఇది రెండు భాగాలుగా తెర‌కెక్క‌నుంది. ఇందులో అనుష్క న‌టించ‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ ఎంతో న‌చ్చి ఉంటే త‌ప్ప అనుష్క మ‌ల‌యాళ సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్ట‌ద‌ని సినీ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న టాక్‌.

ఇక తెలుగు సినిమాల విష‌యానికి వ‌స్తే అనుష్క వ‌రుస సినిమాలు చేయ‌టం లేదు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో ప్ర‌ధానంగా న‌టిస్తుంది. అది కూడా గ్యాప్‌లు తీసుకుంటూ. రీసెంట్‌గా మిస్ శెట్టి మిస్ట‌ర్ పొలిశెట్టి చిత్రంలో ఆమె క‌థానాయిక‌గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. న‌వీన్ పొలిశెట్టి ఇందులో హీరో. ఈ సినిమా మంచి విజ‌యాన్ని సాధించింది. చాలా రోజుల త‌ర్వాత అనుష్క‌కు మంచి స‌క్సెస్‌ను తెచ్చి పెట్టిన సినిమా ఇది. అంత‌కు ముందు నిశ్శ‌బ్దం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు డైరెక్ట‌ర్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా వ‌చ్చిన‌ప్ప‌టికీ అదేమీ అంత పేరుని తెచ్చిపెట్ట‌లేదు. ఓ ర‌కంగా అనుష్క‌పై విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి.

అనుష్క సినిమా సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకుంటుంది. అందుకు కార‌ణం.. అంతకు ముందు సైజ్ జీరో సినిమాకుగానూ ఆమె త‌న బ‌రువు పెంచుకుని లుక్ మార్చి మ‌రీ న‌టించారు. అయితే త‌ర్వాత ఆమె ఆ బ‌రువును త‌గ్గించుకోలేక‌పోతున్నారు. మ‌ధ్యలో బాహుబ‌లి, భాగ‌మ‌తి సినిమాల్లో న‌టించి మెప్పించిన‌ప్ప‌టికీ అనుష్క లుక్‌పై మాట‌లు వినిపిస్తూనే వ‌స్తున్నాయి. దీంతో ఆమె ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు. బ‌రువు త‌గ్గి లుక్ మార్చుకునే ప‌నిలో ఉన్నారు మ‌రి. దీని త‌ర్వాత అనుష్క తెలుగులో ఏ సినిమా చేస్తారోన‌ని ఆమె అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.