English | Telugu

రుద్రమదేవికి మోక్ష మెప్పుడో?

Anushka ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన చారిత్రాత్మక మూవీ 'రుద్రమదేవి'. ఈ సినిమాను ఏ సమయంలో విడుదల చేయాలో తెలియక గుణశేఖర్ గత కొంతకాలంగా సతమతమవుతున్నారు. లేటెస్ట్ గా 'రుద్రమదేవి'ని బాహుబలి రిలీజ్ తరువాత విడుదల చేద్దామనే సన్నాహాలు గుణశేఖర్ మొదలు పెట్టినట్లు సమాచారం.

ఈ నెల 10న బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానున్న సందర్భంలో ఆ సినిమాకి వచ్చే రెస్పాన్స్ బట్టి రుద్రమదేవిని వెంటనే రిలీజ్ చేయాలా లేక ఆగస్టు ఆఖరుకు వెళ్లాలనెది గుణశేఖర్ డిసైడ్ చేస్తాడట. కానీ ఎటు చూసిన గుణశేఖర్ రుద్రమదేవికి పోటీ తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఆగస్ట్ లో మహేష్ శ్రీమంతుడు, రవితేజ కిక్ రిలీజ్ కి సిద్దంగా వున్నాయి.

మహేష్ శ్రీమంతుడు ఆగస్ట్ మొదటి వారంలో రిలీజ్ అవుతుండగా, రవితేజ కిక్ 2 మూడో వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ రెండు సినిమాలపై అభిమానులలో భారీ అంచనాలే వున్నాయి. దీంతో ఈ రెండు సినిమాలు సూపర్ అంటే మాత్రం మళ్లీ మరోసారి 'రుద్రమదేవి' వాయిదాకు వెనుకాడకపోవచ్చు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.