English | Telugu

మాట‌ల మాంత్రికుడిని పట్టేసిన నితిన్

స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమా తరువాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎవరితో సినిమా చేయబోతున్నాడన్న దానిపై ఇంత వరకు క్లారిటీ రాలేదు. స్టార్ కథానాయకులు బిజీ అయిపోవడంతో త్రివిక్రమ్ ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. కానీ దానిలో కూడా నిజం లేదని తేలిపోయింది.లేటెస్ట్ గా త్రివిక్రమ్ ఓ చిన్న హీరోతో సినిమా చేద్దామని ప్లాన్ చేస్తున్నాడట.

ఈ విషయం తెలుసుకున్న హీరో నితిన్..మాటల మంత్రికుడి వద్ద చాన్స్ కొట్టేయాలని డిసైడ్ అయ్యాడట. వెంటనే తన దేవుడు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తన కోరికను వెళ్ళబుచ్చాడట. దీంతో ఆయన తన స్నేహితుడు అయిన త్రివిక్రమ్ కు నితిన్ తో ఓ సినిమా చేయమని సూచించడట.

ప్రస్తుతం నితిన్ కూడా మంచి సక్సెస్ ట్రాక్ లో వుండడం, మనోడికి మాస్ లో కూడా ఎక్కువ ఫాలోయింగ్ వుండడంతో త్రివిక్రమ్ ఓకే చెప్పినట్టు సమాచారం. దాంతో మాట‌ల మాంత్రికుడు నితిన్ కోసం ఓ కథ తయారు చేస్తున్నాడట. త్వరలో సినిమా సెట్స్ పైకి కూడా వెళ్ళుతు౦దట. ఎలాగైతేనే౦ పెద్ద హీరోలకే దొరకని మాట‌ల మాంత్రికుడిని నితిన్ పట్టేసాడు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.