English | Telugu

ఏఎన్ఆర్ జయంతి సందర్భంగా నాగార్జున బంపర్ ఆఫర్ 

తెలుగు సినిమా జననం, నటసామ్రాట్, ఎవర్ గ్రీన్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత 'అక్కినేని నాగేశ్వరరావు'(ANR)గారి సినీ రంగ ప్రవేశం ఇంచు మించు ఒకేసారి జరిగిందని చెప్పవచ్చు. ఆయనతో పాటే తెలుగు సినిమా కూడా ఎదిగింది. ఏడున్నర దశాబ్దాల సినీ ప్రస్థానం 'ఏఎన్ఆర్' సొంతం. దీన్ని బట్టి నటనా రంగంలో ఆయన సృష్టించిన ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు. జానపద, పౌరాణిక,సాంఘిక, భక్తి రసచిత్రాల్లో ఆయన పోషించని క్యారక్టర్ లేదు. ఎన్నో అద్భుతమైన క్యారక్టర్ లు నేటికీ ప్రతి తెలుగువాడి గుండెల్లో పదిలంగా ఉన్నాయి..

ఏఎన్ ఆర్ 101 వ జయంతి సెప్టెంబర్ 20 న జరగనుంది. ఈ సందర్భంగా ఆయన వారసుడు కింగ్ 'నాగార్జున'(Nagarjuna)తన తండ్రి నటించిన ఎన్నో మరుపురాని చిత్రాల్లోని డాక్టర్ చక్రవర్తి, ప్రేమాభిషేకం సినిమాలని అభిమానులతో పాటు,ప్రేక్షకుల కోసం రెండు తెలుగు రాష్టాల్లో విడుదల చేస్తున్నారు. కాకపోతే వీటిని ఉచితంగా ప్రదర్శించనున్నారు. ఇందుకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపిక చేసిన థియేటర్స్ వివరాలు 'బుక్ మై షో' లో అందుబాటులో ఉన్నాయి. గత సంవత్సరం కూడా నాగార్జున ఈ అవకాశాన్ని కలిపించిన విషయం తెలిసిందే.

దీంతో థియేటర్స్ లో 'ఏఎన్ఆర్' అభిమానుల కోలాహలం నెలకొంది. ఈ సంవత్సరం కూడా అంతకు మించిన కోలాహలం నెలకొని ఉంటుందని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎప్పటిలాగానే రెండు రాష్ట్రాల్లో ఉన్నఅభిమానులు 'ఏఎన్ఆర్' జయంతి వేడుకల్ని ఎంతో ఘనంగా జరపనున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.