English | Telugu

Andhra King Taluka: ఆంధ్ర కింగ్ తాలూకా ట్విట్టర్ రివ్యూ.. అసలు ఊహించలేదు..!

థియేటర్లలో అడుగుపెట్టిన ఆంధ్ర కింగ్ తాలూకా
ప్రీమియర్స్ టాక్ ఎలా ఉంది?
రామ్ హిట్ కొట్టాడా?

అందరి హీరోల అభిమానులకు కనెక్ట్ అయ్యే స్టోరీతో అభిమాని బయోపిక్ గా రూపొందిన 'ఆంధ్ర కింగ్ తాలూకా' థియేటర్లలో అడుగుపెట్టింది. రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే, ఉపేంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా నేడు(నవంబర్ 27) విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు పూర్తయ్యాయి. ట్విట్టర్ లో ఈ మూవీ టాక్ ఎలా ఉందంటే..?

ఆంధ్ర కింగ్ తాలూకా చిత్రానికి ట్విట్టర్ లో పాజిటివ్ రివ్యూలు కనిపిస్తున్నాయి. హీరో-అభిమాని ట్రాక్ ని, ప్రేమకథను బ్యాలెన్స్ చేస్తూ సినిమాని తెరకెక్కించిన తీరు బాగుంది అంటున్నారు. ముఖ్యంగా ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయ్యాయని, కథని నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశారని ప్రశంసిస్తున్నారు. నిడివి ఎక్కువ ఉండి, అక్కడక్కడా నెమ్మదిగా సాగినట్టు అనిపించినప్పటికీ.. ఓవరాల్ గా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుందని చెబుతున్నారు. ఎమోషన్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్, మ్యూజిక్, డైలాగ్స్ ప్రధాన బలంగా నిలిచాయని పలువురు ట్విట్టర్ లో రాసుకొస్తున్నారు.

Also Read: 'ఆంధ్ర కింగ్ తాలూకా' ఫస్ట్ రివ్యూ!

ఆంధ్ర కింగ్ తాలూకాకు ట్విట్టర్ లో దాదాపుగా అన్నీ పాజిటివ్ రివ్యూలే కనిపిస్తున్నాయి. సినిమా ఇంత బాగుంటుందని అసలు ఊహించలేదని, ముఖ్యంగా క్లైమాక్స్ కోసమైనా ఈ సినిమా చూడొచ్చని అంటున్నారు.

ఇక రామ్ అభిమానులైతే.. తమ హీరో మాస్ ఊబి నుండి బయటకు వచ్చి, ఒక మంచి సినిమా చేశాడని.. ఎట్టకేలకు హిట్ కొట్టేశాడాని సంబర పడుతున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.