English | Telugu

తీవ్ర విషాదంలో యాంకర్ ఝాన్సీ.. ఇది ఆమెకి కోలుకోలేని దెబ్బే

బుల్లి తెర, వెండి తెర రెండింటిలోను తనదయిన శైలిలో నటిస్తూ ముందుకు దూసుపోయే నటీమణి ఝాన్సీ. దాదాపుగా టెలివిజన్ రంగం పుట్టినప్పటినుంచే ఝాన్సీ ఎన్నో ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేస్తు వస్తున్నారు. తాజాగా ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ పలువురిని కంటతడిపెట్టిస్తుంది.

ఝాన్సీ దగ్గర హెయిర్ స్టైలిస్ట్ గా పని చెయ్యడం ప్రారంభించి ఆవిడ పర్సనల్ సెక్రటరీ స్థాయికి ఎదిగిన వ్యక్తి శ్రీను. తాజాగా కార్డియాక్ అరెస్ట్ వలన శ్రీను చనిపోయాడు. ఈ విషయం గురించే ఝాన్సీ తన ట్విటర్ లో శ్రీను ఫోటో ని పోస్ట్ చేసి శ్రీను తనకి ఎంత కావలసిన వ్యక్తో చెప్పింది. శ్రీను నాకు తమ్ముడు లాంటి వాడు ఎప్పుడు నవ్వుతు సరదాగా ఉండే శ్రీను 35 సంవత్సరాల వయసులో చనిపోవడం నాకు నిజంగా బాధగా ఉందనిచెప్పింది.

శ్రీను కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు నా ఆలోచన, నా ఉపశమనం,నా వర్క్ బ్యాలన్స్ ,నా తెలివి ఇలా నా పూర్తి బలం శ్రీను నే . అలాగే శ్రీను చాలా సున్నితమైన వ్యక్తి ఇంత చిన్న వయసులో శ్రీను చనిపోవడం నన్ను తీవ్రంగా కలిచివేస్తుంది. ఈ సమయంలో నాకు మాటలు కూడా రావడం లేదు, శ్రీను మరణంతో జీవితం ఒక నీటి బుడగ అని మరోసారి అర్ధం అయ్యిందని బాగా ఎమోషనల్ అవుతు ఝాన్సీ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.