English | Telugu

రెండో పెళ్లి చేసుకున్న అమల.. ఫోటోలు వైరల్‌!

సినీ పరిశ్రమలో పెళ్ళి చేసుకోవడం, కొన్నాళ్ళు కాపురం చేయడం.. ఆ తర్వాత అభిప్రాయ భేదాల వల్ల విడాకులు తీసుకోవడం సర్వసాధారణమైన విషయం. అలాగే రెండో పెళ్ళి చేసుకోవడం కూడా అంతే సహజం. అదే పద్ధతిలో ఇప్పుడు హీరోయిన్‌ అమలాపాల్‌ రెండో వివాహం చేసుకుంది. తన ప్రియుడు జగత్‌ దేశాయ్‌ని కొచ్చిలోని ఓ చర్చిలో క్రిస్టియన్‌ సంప్రదాయం ప్రకారం పెళ్ళి చేసుకుంది అమల. పది రోజుల క్రితం వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. అంతకు కొద్దిరోజుల ముందు అమలాపాల్‌ పుట్టినరోజు వేడుకలో జగత్‌ దేశాయ్‌ ఆమెకు పెళ్ళి ప్రపోజల్‌ పెట్టాడు. ఆమె కూడా ఓకే చెప్పడంతో పెళ్లి బాట పట్టారు. అమలా పాల్‌ అంతకు ముందు తమిళ దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2014లో వీరి పెళ్లి జరిగింది. ఎక్కువ కాలం వీరిద్దరూ కలిసి జీవించలేకపోయారు. 2017లో విడాకులు తీసుకున్నారు. తర్వాతి నుంచి అమల సింగిల్‌గానే ఉంటోంది. 6 ఏళ్ల తర్వాత ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది.

2009లో ‘నీల తామర’ అనే మలయాళ సినిమాతో నటిగా పరిచయమైంది. 2011లో నాగచైతన్య హీరోగా వచ్చిన ‘బెజవాడ’ చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తోంది అమల.ప్రస్తుతం ఆమె మలయాళంలో రెండు సినిమాలు చేస్తున్నారు. ద్విజ అనే సినిమా శరావేగంగా షూటింగ్‌ జరుపుకుంటూ ఉండగా.. ఇంకో సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.