English | Telugu

అట్లీ ప్రాజెక్ట్.. తెలివిగా తప్పించుకున్న అల్లు అర్జున్..!

'పుష్ప-2'తో సంచలన విజయాన్ని అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun).. తన కొత్త సినిమాని మొదలుపెట్టే పనుల్లో బిజీగా ఉన్నాడు. అల్లు అర్జున్ ఇప్పటికే దర్శకులు త్రివిక్రమ్, అట్లీలతో సినిమాలు కమిటై ఉన్నాడు. బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 8న ఈ రెండు సినిమాల అప్డేట్స్ వచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే, అట్లీ సినిమా విషయంలో అల్లు అర్జున్ తీసుకున్న ఓ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.

బన్నీ-అట్లీ కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఉండటం సహజం. అయితే మొదట ఈ సినిమాని మల్టీస్టారర్ గా తీయాలని అట్లీ భావించాడట. అల్లు అర్జున్ కి తోడు, మరో స్టార్ ని దృష్టిలో ఉంచుకొని కథని సిద్ధం చేశాడట. బన్నీకి కథ ఎంతగానో నచ్చినప్పటికీ.. మల్టీస్టారర్ చేయడానికి మాత్రం నో చెప్పాడట. దీంతో అట్లీ.. కథలో మార్పులు చేసి, దానినే ట్విన్ బ్రదర్స్ కథలా మార్చాడట. దాంతో మల్టీస్టారర్ స్క్రిప్ట్ కాస్తా.. డ్యూల్ రోల్ స్క్రిప్ట్ గా మారిపోయిందని సమాచారం.

అయితే మల్టీస్టారర్ కి అల్లు అర్జున్ నో చెప్పడం వెనక బలమైన కారణం ఉందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ఆర్ఆర్' అనే మల్టీస్టారర్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మూవీ ఘన విజయం సాధించగా.. సక్సెస్ క్రెడిట్ కోసం ఎన్టీఆర్, చరణ్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. "మా హీరో మెయిన్ హీరో.. మీ హీరో సైడ్ హీరో" అంటూ ఇప్పటికీ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ గొడవ పడుతూనే ఉన్నారు. సక్సెస్ క్రెడిట్ కోసం కొట్లాటలు, ఫ్యాన్ వార్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే.. మల్టీస్టారర్ విషయంలో బన్నీ వెనకడుగు వేసినట్లు వినికిడి.

అల్లు అర్జున్ నిర్ణయాన్ని గౌరవించిన అట్లీ.. స్క్రిప్ట్ లో మార్పులు చేయడంతో అది ట్విన్ బ్రదర్ కథలా మారిపోయింది. దీంతో మరో స్టార్ చేయాల్సిన రోల్ ని సైతం బన్నీ చేసేస్తున్నాడని టాక్. ఈ విషయం తెలిసి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మా హీరో మల్టీస్టారర్ కి నో చెప్పి మంచి పని చేశాడని సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.