English | Telugu

Akhanda 2: 'అఖండ'కు రెట్టింపు బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ తెలిస్తే మైండ్ బ్లాక్!

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందిన 'అఖండ 2: తాండవం' మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. డిసెంబర్ 4న రాత్రి ప్రీమియర్ షోలతోనే అఖండ తాండవం మొదలుకానుంది. (Akhanda 2: Thaandavam)

అసలే బాలకృష్ణ-బోయపాటి కాంబో, దానికితోడు 'అఖండ' సీక్వెల్ కావడంతో.. 'అఖండ 2'పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే.. బాలయ్య కెరీర్ లోనే రికార్డు బిజినెస్ చేసింది.

బాలకృష్ణ కెరీర్ లో వంద కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేసిన మొదటి సినిమా 'అఖండ 2' కావడం విశేషం. ట్రేడ్ వర్గాల ప్రకారం ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.114.25 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది.

నైజాంలో రూ.23.50 కోట్లు, సీడెడ్ లో రూ.22 కోట్లు, ఆంధ్రాలో రూ.42.75 కోట్లతో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి రూ.88.25 కోట్ల బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా రూ.11 కోట్లు, ఓవర్సీస్ లో రూ.15 కోట్లతో వరల్డ్ వైడ్ గా రూ.114.25 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం.

Also Read: విడుదలకు కొన్ని గంటల ముందు లీక్.. అఖండ-3 టైటిల్ ఇదే..!

2021లో వచ్చిన 'అఖండ' రూ.53 కోట్ల బిజినెస్ చేయగా.. ఇప్పుడు 'అఖండ 2' దానికి రెట్టింపు బిజినెస్ చేయడం విశేషం.

'అఖండ 2' బాక్సాఫీస్ దగ్గర హిట్ స్టేటస్ దక్కించుకోవాలంటే.. రూ.115 కోట్లకు పైగా షేర్ రాబట్టాల్సి ఉంది. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా ఈ సినిమాపై నెలకొన్న బజ్ ని బట్టి చూస్తే.. ఆ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని రీచ్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.