English | Telugu

యూర‌ప్‌లో అజిత్‌... ఖుషి ఖుషీగా షాలిని!

అజిత్ కుమార్ ప్ర‌స్తుతం యూరోప్‌లో ఉన్నారు. గ్రాండ్ వ‌ర‌ల్డ్ బైక్ టూర్ ప్లాన్‌లో భాగంగా ఆయ‌న అక్క‌డికి చేరుకున్నారు. ఈ విష‌యాన్ని ఆయ‌న భార్య షాలిని షేర్ చేశారు. త‌న భ‌ర్త ఏం చేసినా, ప‌క్క‌నే చీర్ లేడీగా ఉంటారు షాలిని. ఇప్పుడు బైక్ టూర్ ప్లానింగ్‌లోనూ అజిత్ అభిప్రాయాల‌కు విలువిచ్చి, ఇష్టానుసారంగా చేసుకోమ‌ని ప్రోత్స‌హిస్తున్నారు. యూనిక్ లైఫ్ స్టైల్‌ని, డిఫ‌రెంట్ చాయిసుల‌ని బ్యాల‌న్స్ చేసుకోవ‌డంలో అజిత్ త‌ర్వాతే ఇంకెవ‌రైనా. లైమ్ లైట్‌కి కంప్లీట్‌గా దూరంగా ఉండాల‌నుకునే న‌టుడు అజిత్‌. షూటింగ్ లేని స‌మ‌యంలో ఎక్కువ‌గా వ‌ర‌ల్డ్ టూర్‌లు వెళ్తుంటారు. ఇప్పుడు యూర‌ప్‌లో ఉన్నారు. ఇంత‌కు ముందు కూడా అజిత్ చాలా ప్ర‌దేశాల‌కు బైక్ మీద వెళ్లేవారు. అయితే సోష‌ల్ మీడియా పెరిగిన త‌ర్వాత ఫ్యాన్స్ కి ఆ అప్‌డేట్స్ ఎక్కువ‌గా తెలుస్తున్నాయి. అందులోనూ రీసెంట్ టైమ్స్ లో షాలిని బాగా యాక్టివ్ అయ్యారు.

అజిత్ ఫ్యాన్స్ కోసం అప్పుడ‌ప్పుడూ లీక్‌లు ఇస్తున్నారు. థాంక్యూ మేడ‌మ్ అంటూ ఖుషీ అవుతున్నారు ఫ్యాన్స్. కేవ‌లం అజిత్ కోసం మాత్ర‌మే కాదు, పిల్ల‌లు అనౌష్క‌, ఆద్విక్ ఫొటోల‌ను కూడా షేర్ చేస్తుంటారు షాలిని. జ‌ర్మ‌నీ, నార్వే, డెన్మార్క్... వేటు గో అంటూ క్యాప్ష‌న్ పెట్టి రీసెంట్‌గా రిలీజ్ చేసిన పిక్స్ వైర‌ల్ అవుతున్నాయి. రైడ‌ర్ జాకెట్‌తో ఉన్న అజిత్ స్ట‌న్నింగ్ పిక్స్ మెప్పిస్తున్నాయి. యూర‌ప్ ట్రిప్ కంప్లీట్ కాగానే అజిత్ చెన్నైలో ల్యాండ్ అవుతారు. ఆయ‌న న‌టించే 62వ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. మ‌గిళ్ తిరుమేని డైర‌క్ష‌న్‌లో వ‌స్తున్న సినిమా ఇది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మిస్తోంది. త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.