English | Telugu

అజిత్‌... మండు వేస‌విలో మొద‌లుపెడ‌తారా?

త‌మిళ ఇండ‌స్ట్రీ త‌ల అజిత్‌. అంతా అనుకున్న‌ట్టే జ‌రిగి ఉంటే ఈ దీపావ‌ళికి ఆయ‌న సినిమా విడుద‌ల కావాల్సింది. ఈ ఏడాది సంక్రాంతికి తునివు సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు అజిత్‌. అదే సీజ‌న్‌లో వార‌సుడు సినిమాతో అభిమానుల‌ను ప‌ల‌క‌రించారు విజ‌య్‌. వీరిద్ద‌రూ మ‌ళ్లీ దీపావ‌ళి సీజ‌న్‌లో పోటీప‌డ‌టం ఖాయం అని అప్ప‌ట్లో వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. అయితే తునివు త‌ర్వాత వ‌ర‌ల్డ్ టూర్ వెళ్లారు అజిత్. భార్యాపిల్ల‌ల‌తో వెకేష‌న్‌కి వెళ్లారు. న‌య‌న‌తార భ‌ర్త విఘ్నేష్ శివ‌న్‌తో చేయాల్సిన ప్రాజెక్ట్ కూడా కేన్సిల్ అయింది. క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ టేకాఫ్ కాలేద‌న్న‌ది కోలీవుడ్ న్యూస్‌.
అంత‌లోనే మ‌గిళ్ తిరుమేని అనే డైర‌క్ట‌ర్ చెప్పిన క‌థ న‌చ్చింద‌ని అన్నారు.

అయితే పాయింట్‌గా దానికి ఓకే చెప్పిన అజిత్‌, నెరేష‌న్ విషయంలో మాత్రం నో చెప్పార‌ట‌. అందుకే స‌రికొత్త సీన్లు రాసుకోవ‌డానికి మ‌గిళ్ తిరుమేనికి టైమ్ ప‌ట్టింది. ఇంత‌లో అజిత్ తండ్రి సుబ్ర‌మ‌ణ్యం క‌న్నుమూశారు. అజిత్ ఫ్యామిలీ శోక సంద్రంలో మునిగిపోయింది. కోలీవుడ్ నుంచి స్టార్ హీరోలు అంద‌రూ అజిత్‌కి సానుభూతిని వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో అజిత్ నెక్స్ట్ మూవీకి సంబంధించిన ఇంట్ర‌స్టింగ్ విష‌యం వైర‌ల్ అవుతోంది. ముందు అనుకున్న ప్ర‌కార‌మైతే ఏకే 62 సినిమా ఏప్రిల్‌లో రెగ్యుల‌ర్ షూటింగ్‌కి ముహూర్తం జ‌రుపుకోవాలి. కానీ, ఇప్పుడు అజిత్ తండ్రి మ‌ర‌ణించ‌డంతో ఈ సినిమా ఓపెనింగ్ వాయిదా ప‌డింది. మేలో ఈ సినిమాకు సంబంధించి కంటిన్యూస్ షెడ్యూల్ పెట్టుకుందామ‌ని అన్నార‌ట అజిత్‌. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సీఈఓ జీకేఎం త‌మిళ్ కుమర‌న్ ఈ విష‌యం గురించి హింట్ ఇచ్చారు. అజిత్ కుమార్ తండ్రి మ‌ర‌ణానంత‌రంవాళ్ల ఇంటికి వెళ్లారు త‌మిళ్ కుమ‌ర‌న్‌.

అక్క‌డ మీడియాతో మాట్లాడుతూ అజిత్ సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌నే విష‌యం మీద క్లారిటీ రావాల్సి ఉంది. త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం అని అన్నారు. ఆల్రెడీ ఫిబ్ర‌వ‌రిలో అత్యంత స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఏకే62 పూజా కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. మగిళ్ తిరుమేని ఇప్పుడు మ్యూజిక్ సిట్టింగ్స్ తో బిజీగా ఉన్నారు. సంతోష్ నారాయ‌ణ‌న్ ట్యూన్లు క‌డుతున్నారు.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు.