English | Telugu

ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో భారీ చోరీ!

సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె, దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ ఇంట్లో దొంగతనం జరిగింది. చెన్నైలోని తన నివాసంలో లాకర్ లో భద్రపరిచిన లక్షల్లో విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని ఐశ్వర్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019లో జరిగిన తన సోదరి సౌందర్య వివాహానికి ఆ ఆభరణాలు ధరించానని చెప్పిన ఆమె.. ఆ తర్వాత వాటిని లాకర్ లోనే భద్రపరిచానని, అయితే ఇటీవల లాకర్ తెరిచి చూడగా ఆభరణాలు మాయమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఐశ్వర్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇంట్లో పనిచేసే సిబ్బంది పనే అయ్యుంటుందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

కాగా ఐశ్వర్య తమిళ హీరో ధనుష్ కి మాజీ భార్య అనే విషయం తెలిసిందే. 2004 లో వివాహం చేసుకున్న వీరు.. 18 ఏళ్ళ తరువాత గతేడాది విడాకులు తీసుకొని షాక్ ఇచ్చారు. ధనుష్ హీరోగా నటించిన '3'(2012) సినిమాతో దర్శకురాలిగా పరిచయమైన ఐశ్వర్య.. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె దర్శకత్వంలో 'లాల్ సలాం' అనే చిత్రం రూపొందుతోంది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.