English | Telugu

ఓటీటీలో 'ఆదిపురుష్' స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా!

'ఆదిపురుష్'తో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ వేటకి సిద్ధమయ్యారు. ఆయన శ్రీరాముడి పాత్ర పోషించిన ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకొస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కి వస్తున్న స్పందన చూస్తుంటే ఈ మూవీ రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమనిపిస్తోంది. రామాయణ గాధ ఆధారంగా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ విజువల్ వండర్ ని బిగ్ స్క్రీన్ పై చూడటానికి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న ఆసక్తి దృష్ట్యా మరియు ఈ అద్భుతాన్ని బిగ్ స్క్రీన్ పైనే ఎక్కువ శాతం చూసేలా చేయాలన్న ఉద్దేశంతో ఓటీటీలో లేటుగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట.

ఇటీవల హిట్-ప్లాప్, చిన్న-పెద్ద అనే తేడా లేకుండా మెజారిటీ సినిమాలు థియేటర్స్ లో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీ బాట పడుతున్నాయి. కానీ 'ఆదిపురుష్' మాత్రం ఓటీటీలోకి కాస్త ఆలస్యంగా రానుందట. 'ఆదిపురుష్' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ ధరకు దక్కించుకుంది. అయితే మిగతా సినిమాల్లాగా నాలుగు వారాల తర్వాత ప్రదర్శించేలా కాకుండా, ఎనిమిది వారాల తర్వాతే స్ట్రీమింగ్ చేసేలా మేకర్స్ అగ్రిమెంట్ చేసుకున్నారట. అంటే ఆగస్టు 11 తర్వాతే 'ఆదిపురుష్' ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

టి. సిరీస్ బ్యానర్‌ లో రూపొందిన 'ఆదిపురుష్'కి ఓం రౌత్‌ దర్శకుడు. ఈ సినిమాలో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే నటించారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.