English | Telugu

ఈ నగరానికి ఏమైంది?.. ఓ వైపు రీరిలీజ్, మరోవైపు టీజర్!

'పెళ్ళి చూపులు'(2016) సినిమాతో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే జాతీయ అవార్డు అందుకున్నారు తరుణ్ భాస్కర్. ఆ తర్వాత చేసిన 'ఈ నగరానికి ఏమైంది?'(2018) సినిమాతోనూ అదేస్థాయిలో మెప్పించారు. ఈ రెండు సినిమాలకు ఎందరో అభిమానులు ఉన్నారు. నటుడిగా, రచయితగా ఇతర సినిమాలతో బిజీ అవ్వడంతో దర్శకుడిగా మూడో సినిమా స్టార్ట్ చేయడానికి తరుణ్ భాస్కర్ ఎక్కువ సమయం తీసుకున్నారు. దీంతో ఆయన సినిమాలను ఇష్టపడేవారు మూడో సినిమా ఎప్పుడొస్తుందా అని ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే తరుణ్ భాస్కర్ తన కొత్త సినిమా టీజర్ చూపించబోతున్నారు.

తరుణ్ భాస్కర్ కెరీర్ లో 29 కి ప్రత్యేక స్థానముంది. ఆయన మొదటి సినిమా 'పెళ్ళి చూపులు' 2016 జూలై 29న విడుదల కాగా, రెండో సినిమా 'ఈ నగరానికి ఏమైంది?' 2018 జూన్ 29న విడుదలైంది. ఈ జూన్ 29 తో 'ఈ నగరానికి ఏమైంది?' విడుదలై ఐదేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా ఆ సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు అదేరోజున తరుణ్ దర్శకత్వంలో రూపొందుతోన్న కొత్త సినిమా 'కీడా కోలా' టీజర్ విడుదల చేస్తున్నట్లు తెలిపారు. తరుణ్ భాస్కర్ సినిమాలను అభిమానించే వారికి ఇది డబుల్ ధమాకా అని చెప్పొచ్చు.

'కీడా కోలా' అనేది క్రైమ్ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం. ఇందులో మొత్తం ఎనిమిది ముఖ్యపాత్రలు ఉంటాయి. వాటిలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఓ పాత్ర పోషిస్తున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.