English | Telugu

కమెడియన్ యోగిబాబు తో జత కట్టనున్న టాప్ హీరోయిన్ 

కొన్ని నెలల క్రితం హీరో విశాల్ కి తమిళ చిత్ర పరిశ్రమకే చెందిన లక్షి మీనన్ కి పెళ్లి అవ్వబోతుందనే వార్త వచ్చింది. అప్పట్లో వచ్చిన ఆ వార్త దక్షిణ భారతీయ చిత్ర పరిశ్రమ మొత్తాన్ని ఒక కుదుపు కుదిపింది. ఇప్పుడు లక్షిమీనన్ నటించబోయే తదుపరి సినిమా హీరో విషయంలో అంతే సంచలనం సృష్టిస్తుంది.

తమిళ చిత్ర సీమలో లక్షిమీనన్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన లక్షిమీనన్ తన తదుపరి సినిమాని కమెడియన్ యోగిబాబు తో కలిసి చేయనుంది.యోగిబాబు పక్కన హీరోయిన్ గా లక్షిమీనన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతుందనే వార్త తమినాడు చిత్ర పరిశ్రమ మొత్తాన్ని ఒక కుదుపు కుదుపుతుంది. లక్షిమీనన్ యోగిబాబు లు కలిసి నటించబోతున్నారనే వార్తని త్వరలోనే చిత్ర బృందం అధికారకంగా ప్రకటించనుంది. లక్ష్మి మీనన్ ఇటీవలే చంద్రముఖి 2 లో సూపర్ గా నటించి అందరి ప్రశంసల్ని అందుకుంది.

2011 వ సంవత్సరం లో రఘువింటే స్వంతం రసియా అనే మలయాళ సినిమా ద్వారా వెండి తెర ప్రవేశం చేసిన లక్ష్మి మీనన్ ఆ తర్వాత తమిళంలో వరుసపెట్టి సినిమాలు చేసింది. సుందర పాండియన్, కుంకీ ,కుట్టి పులి,జిగర్తాండ, పాండియ నాడు, నా సిగప్పు మనితన్, నా బంగారు తల్లి,అవతారం ,కొంబన్ ,వేదాళం, మీరుతన్,రెక్క ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి అశేష అభిమానులని సంపాదించుకుంది. విశాల్, సూర్య, విజయ్ సేతుపతి ,అజిత్ లాంటి అగ్ర హీరోలందరి తో కలిసి నటించిన లక్షిమీనన్ ఇప్పుడు యోగిబాబుతో కలిసి నటించడం పెద్ద సంచలనమే.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.