English | Telugu

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!

మలయాళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు కుందర జానీ కన్నుమూశారు. 72 ఏళ్ళ జానీ మంగళవారం రాత్రి గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రాత్రి సమయంలో ఆయనకు ఛాతి నొప్పి రావడంతో వెంటనే కుటుంబ సభ్యులు దగ్గరలోని ఆస్పత్రికి తీసుకెళ్ళగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపినట్లు సమాచారం.

కుందర జానీ 1951, జనవరి 1న కేరళలోని కొల్లాంలో జన్మించారు. 1979 విడుదలైన 'నిత్య వసంతం' అనే సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. మొదటి సినిమాలోనే వయసుకి మించిన పాత్రలో నటించి మెప్పించిన ఆయనకు వరుస అవకాశాలు వచ్చాయి. మలయాళంలో వందకి పైగా సినిమాల్లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. తెలుగులో 'రౌడీయిజం నశించాలి' అనే సినిమాలో ఆయన నటించారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.