English | Telugu

డబుల్  మీనింగ్ డైలాగ్స్ తో రెచ్చిపోతున్న హీరో 

వరుస సినిమాలతో టాలీవుడ్ లో తన సత్తా చాటుతున్న నటుడు విశ్వేక్ సేన్ .అతి కొద్ది కాలంలోనే ఎన్నో చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఇప్పుడు ఓటిటి వేదికగా కూడా తన సత్తా చాటుతున్నాడు. ప్రముఖ ఓటిటి సంస్థ ఆహా లో ప్రసారమయ్యే ఫ్యామిలీ ధమాకా షో కి విశ్వక్ సేన్ యాంకరింగ్ చేషున్నాడు. ఆల్రెడీ షో కూడా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ఇప్పుడు దసరా సందర్భంగా టెలి కాస్ట్ అయ్యే కంటెంట్ కి సంబంధించిన ప్రోమోని ఆహా వాళ్ళు రిలీజ్ చేసారు. ఆ ప్రోమో మాములుగా లేదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రచ్చ రచ్చ చేస్తుంది.

దసరా కి టెలికాస్ట్ అయ్యే ఈ షో లో యంగ్ హీరోయిన్లు చాందిని,సిమ్రాన్ చౌదరి, బిగ్ బాస్ తేజస్వి అనిషా,అనన్య లు ప్రేక్షకులని కనువిందు చెయ్యనున్నారు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో విశ్వక్ సేన్ తన పక్కనే ఉన్న అనన్య ని ఉద్దేశించి అనన్యకి నేనంటే చాలా కోపం ఎందుకంటే తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు హోలీ పండగ వచ్చింది. ఆ రోజు తన మీద కలర్ కొట్టి వాటర్ కొట్టాను దాంతో అనన్య అలిగి వెళ్లిపోయింది అని అన్నాడు. అంతవరకు బాగానే ఉంది ఆ పై వెంటనే మరి నా మీద ఎప్పుడు కొడతావు అని తేజస్వి అడగగానే నువ్వెప్పుడు ప్రెగ్నెంట్ అయ్యావు అని విశ్వక్ సేన్ అన్నాడు. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య చాలా డబుల్ మీనింగ్ డైలాగ్స్ జరిగాయి.

తేజు నువ్వు ముగ్గు ఎందుకు వేస్తావు ముగ్గులోకి దించుతావు కానీ అని విశ్వక్ సేన్ తేజస్విని అనడంతో పాటు నాకిప్పుడు నాలుగేళ్లు నువ్వు నా బామ్మవి అని కూడా విశ్వక్ సేన్ అనగానే తేజస్వి విశ్వక్ సేన్ ని చిన్నపిల్లవాడిలా భావించి ఏమైంది నాన్న ఎందుకు తినడంలేదు అని అంది.దానికి బదులుగా నేను ముద్ద తినను అని విశ్వక్ సేన్ అనగానే ముద్దు కావాలా అని తేజస్వి అనడంతో షో మొత్తం ఎంత బోల్డ్ గా ఉండబోతుందో అందరికి అర్ధం అయ్యింది. అలాగే మరో కంటెస్ట్ విశ్వక్ సేన్ ని సమోసా తింటావా విశ్వక్ అని అడగగానే నువ్వు ఉండగా సమోసా ఎందుకు అని విశ్వక్ సేన్ అన్నాడు. దీంతో ఈ దసరాకి ధమాకా షో లో ఫుల్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ మోత మోగిపోవడం ఖాయమని ప్రోమో చూసిన వాళ్ళు చెప్తున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియా లో ఈ ప్రోమో మోత మోగిపోతుంది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.