English | Telugu

నీ ముక్కు క్యూట్ గా ఉంది.. బేబీకి బ్రేక్ వచ్చింది.. నీకు బ్రేక్ ఎప్పుడొస్తుంది?

దీప్తి సునైనా ఈ బ్యూటీ ఇంతకు ముందు వరకు ఎవరికీ పెద్దగా తెలీదు కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ కి వెళ్లిందో అప్పటి నుంచి అందరికీ బాగా పరిచయం ఐపోయింది. ఐతే బిగ్ బాస్ కి వెళ్లి వచ్చాక చాలా మందికి అదృష్టం కలిసి వస్తుంది కానీ దీప్తికి మాత్రం ఏ అదృష్టం ఇంకా తలుపు తట్టలేదు. ఏదేమైనా తన రూట్ లో తాను వెళ్ళిపోతూ ఉంది. సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయ్యింది. క్యూట్ బార్బీ డాల్ లాగా కనిపిస్తూ అలరిస్తూ ఉంటుంది. దీప్తి ఫోటోలు చూసిన నెటిజన్లు హీరోయిన్‌గా ట్రై చేయవచ్చు కదా అంటూ సలహాలు ఇస్తున్నారు. చూడటానికి చిన్న పిల్లలా కనిపించే దీప్తి సునైనా ..సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్‌గా కనిపిస్తుంది. రీసెంట్ గా బ్లాక్ డ్రెస్ వేసుకుని కనిపించింది ..అంతే ఇంకేముంది.. బేబీ మూవీ ద్వారా వైష్ణవి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. మరి నీకెప్పుడు వస్తుందో బ్రేక్...ఫొటోషూట్స్ తప్ప ఏమీ లేవు నీకు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక ఇప్పుడు తనను క్వశ్చన్స్ అడగమని అడిగింది దీప్తి.. ఇంకేముంది వెంటనే స్టార్ట్ అయ్యింది చాటింగ్. "నీ ముక్కు ఇన్ఫినిటీ షేప్ లో ఉంటుంది..భలే క్యూట్ గా" అనేసరికి "మీ ఊహలకే వదిలేస్తున్నా" అని చెప్పింది. "ఏ ఫ్రూట్ అంటే నీకు ఇష్టం" అని అడిగేసరికి "మీ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేయను" అని చెప్పింది. "షూటింగ్స్ ఏమీ లేవనుకుంటా ఊరికే స్టోరీస్ పెడుతున్నారు" అనేసరికి సైలెంట్ గా అలా చూస్తూ ఉంది.

ఐతే బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి మూవీ ఛాన్సెస్ కోసం తెగ వెయిట్ చేస్తోంది దీప్తి. బిగ్ బాస్ 2 లో కనిపించింది. ఇప్పుడు సీజన్ 7 స్టార్ట్ కాబోతోంది. ఈ మధ్య సీజన్స్ లో వచ్చిన వాళ్లంతా ఎంతో కొంత అక్కడక్కడా మెరుస్తూనే ఉన్నారు. కానీ దీప్తి మాత్రం అలాగే ఉండిపోయింది అంటున్నారు నెటిజన్స్. ఐతే దీప్తి మాత్రం స్పీడ్ గా కాకుండా నెమ్మదిగా సినిమాలవైపుకు అడుగులేస్తోంది. 2018లో హీరో నిఖిల్ నటించిన 'కిర్రాక్ పార్టీ' మూవీలో నటించింది. ప్రస్తుతం యూట్యూబ్ లోనే మ్యూజిక్ వీడియోస్ చేస్తూ పాపులారిటీని సంపాదిస్తోంది. ఇటీవల 'ఏమై ఉండచ్చో' మ్యూజిక్ వీడియోలో నటించింది. ఈ సాంగ్ బాగా పాపులర్ అయ్యింది.

ధురంధర్ కి 90 కోట్లు నష్టం.. పంపిణి దారుడు ప్రణబ్ కపాడియా వెల్లడి 

రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, ఆదిత్య దర్ ల 'ధురంధర్' విజయ పరంపర ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇంకా యథేచ్ఛగా కొనసాగుతుంది. బహుశా అడ్డు కట్ట వేసే మరో చిత్రం ఇప్పట్లో వచ్చేలా లేదు. వచ్చినా ధురంధర్ ముందు ఏ మాత్రం నిలబడతాయో అనే సందేహం కూడా ట్రేడ్ వర్గాలతో పాటు మూవీ లవర్స్ లో వ్యక్త మవుతుంది. అంతలా 'ధురంధర్' కథనాలు అభిమానులు, ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నాయి. రిపీట్ ఆడియన్స్ కూడా పెద్ద ఎత్తున వెళ్తుండటంతో బాక్స్  ఆఫీస్ వద్ద ఇప్పటికే 1100 కోట్ల రూపాయలని రాబట్టింది. మరి అలాంటి ధురంధర్ కి ఒక ఏరియా లో మాత్రం 90 కోట్ల రూపాయిల నష్టాన్ని చవి చూసింది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.