English | Telugu

'సింహాద్రి' రీరిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ గా ఆ హీరో!

రీరిలీజ్ ట్రెండ్ ని మరోస్థాయికి తీసుకెళ్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. 2003 లో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన 'సింహాద్రి' సినిమాని 20 ఏళ్ళ తర్వాత రీరిలీజ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా మే 20న ఈ చిత్రం భారీస్థాయిలో విడుదల కానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. మీడియం రేంజ్ హీరో కొత్త సినిమా స్థాయిలో టికెట్స్ బుక్ అవుతున్నాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రీరిలీజ్ సినిమాల పరంగా పలు చోట్ల సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇక ఈ రీరిలీజ్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ కొత్త ట్రెండ్ కి కూడా శ్రీకారం చుట్టారు.

కొత్త సినిమాల విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించడం కామన్. అయితే రీరిలీజ్ సినిమాకి ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించడం అనే సరి కొత్త ట్రెండ్ సింహాద్రి తో మొదలవుతోంది. రేపు(మే 17) సింహాద్రి రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో సాయంత్రం 6 గంటల నుంచి జరగనున్న ఈ వేడుకకు చీఫ్ గెస్ట్ గా యంగ్ హీరో విశ్వక్ సేన్ హాజరుకానున్నాడు. ఎన్టీఆర్ కి విశ్వక్ ఎంతటి వీరాభిమానో తెలిసిందే. పలు వేదికలపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. అంతేకాదు విశ్వక్ కోసం 'దాస్ కా ధమ్కీ' ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా కూడా హాజరయ్యాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ రీరిలీజ్ అవుతుంటే.. ఆ వేడుకకు విశ్వక్ గెస్ట్ గా హాజరవవుతూ తన అభిమానాన్ని మరోసారి చాటుకుండటం విశేషం. మొత్తానికి 'సింహాద్రి' రీరిలీజ్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంచలనం సృష్టించేలా ఉన్నారు.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.