English | Telugu

విజయవాడకి వియ్యంకుడు కాబోతున్న విక్టరీ వెంకటేష్..

విక్టరీ వెంకటేష్ అంటే కేవలం తన అభిమానులకే కాకుండా సాధారణ సినిమా ప్రేక్షకులకి కూడా ఎంతో అభిమానం. గత 36 సంవత్సరాల నుంచి ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో వెంకీ గా ఆయన కొలువు తీరి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ కి సంబంధించి వస్తున్న వార్త ఆయన అభిమానులతో పాటు సినీ అభిమానులని ఆనందంలో ముంచెత్తుతుంది.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అందరి హీరో ల ఫ్యామిలీ డిటైల్స్ గురించి ఆయా హీరో ల అభిమానులతో పాటు సాధారణ సినీ ప్రేక్షకుల అందరికి తెలుసు. కానీ వెంకటేష్ ఫ్యామిలీ డిటైల్స్ ఏమిటి వెంకీ వైఫ్ అండ్ పిల్లలు ఎలా ఉంటారు అని మాత్రం గత కొన్ని సంవత్సరాల వరకు ఎవరకి తెలియదు. తన భార్య గురించి గాని పిల్లలు గురించి గాని చెప్పడం గాని వాళ్ళని మీడియా ముందుకు తీసుకొచ్చి పరిచయం చెయ్యడం కానీ చెయ్యలేదు. అంతలా వెంకటేష్ తన ఫ్యామిలీ ప్రొఫైల్ ని మెయిన్ టైన్ చేసాడు. ఇక ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని మారిన వాతావరణ పరిస్థితులని బట్టి సోషల్ మీడియా ద్వారా వెంకటేష్ వైఫ్ అండ్ పిల్లలగురించి అందరికి తెలిసింది.
ఇక అసలు విషయానికి వస్తే వెంకేటేష్ పెద్ద కూతురు అశ్రీత వివాహం సంవత్సరం క్రితం ఆమె ప్రేమించిన వ్యక్తితో అతిరధుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇప్పుడు వెంకటేష్ రెండో కూతురు హయ వాహిని కూడా పెళ్లి పీటలు ఎక్కనుంది. వెంకటేష్ రెండో కూతురు హయ వాహిని వివాహం విజయవాడ కి చెందిన ఒక డాక్టర్ కొడుకుతో జరగనుంది. రేపు విజయవాడ లోఇద్దరికి నిశ్చితార్థం కూడా అత్యంత ఘనంగా జరగనుంది. దీంతో దగ్గుబాటి కుటుంబంలో పెళ్లి సందడి ప్రారంభం అయ్యింది. వెంకటేష్ తాజాగా సైంధవ్ అనే మూవీలో నటిస్తున్నాడు ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ రికార్డు వ్యూయర్స్ తో ముందుకు దూసుకుపోతుంది.

'నువ్వు నాకు నచ్చావ్' క్రెడిట్ మొత్తం వెంకటేష్ గారిదే.. త్రివిక్రమ్ శ్రీనివాస్

విక్టరీ వెంకటేష్, ఆర్తీ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా కె. విజయభాస్కర్ దర్శకత్వంలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ చిత్రం విడుదలై ఇప్పటికీ పాతికేళ్లు అవుతుంది. ఈ మూవీకి కథ, మాటల్ని త్రివిక్రమ్ అందించారు. కోటి స్వరాలు సమకూర్చారు. కల్ట్ క్లాసిక్‌గా నిలిచిన ఈ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత స్రవంతి రవికిషోర్.. రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఆనాటి విశేషాల్ని గుర్తుచేసుకున్నారు. 

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.