English | Telugu

వెంకటేష్, త్రిష జంటగా చిత్రం

వెంకటేష్, త్రిష జంటగా ఒక చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. వివరాల్లోకి వెళితే శ్రీ సాయిగణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై, విక్టరీ వెంకటేష్ హీరోగా, త్రిష హీరోయిన్ గా, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఒక చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. గతంలో వెంకటేష్, త్రిష జంటగా "ఆడవారి మాటలకు అర్థాలు వేరులే", "నమో వెంకటేశా" అనే చిత్రాల్లో నటించారు. ఇది వెంకటేష్, త్రిష కలసి నటిస్తున్న మూడవ చిత్రం కావటం విశేషం.

ఈ చిత్ర దర్శకుడు మలినేని గోపీచంద్ గతంలో రవితేజ హీరోగా నటించిన "డాన్ శీను" అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. డాన్ శీను ఘనవిజయం సాధించింది. ఆ చిత్రం తర్వాత మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదే కావటం విశేషం. వెంకటేష్ హీరోగా, త్రిస్హ హీరోయిన్ గా, మలినేని గోపీచంద్ దర్శకత్వంలో, బెల్లంకొండ సురేష్ నిర్మించే ఈ చిత్రం ఏప్రెల్ నెల మొదటి వారంలో ప్రారంభం కానుందని తెలిసింది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.