English | Telugu

మహేష్, మణిరత్నం మూవీ "వీరుడు"

మహేష్, మణిరత్నం మూవీ "వీరుడు" అని తెలిసింది. మహేష్ బాబు హీరోగా, మణిరత్నం దర్శకత్వంలో రాబోయే తెలుగు, తమిళ, హిందీ మూవీకి "వీరుడు" అన్న పేరుని నిర్ణయించినట్లు సమాచారం. మహేష్, మణిరత్నం మూవీ "వీరుడు" మూవీలో అనుష్క, రీచా గంగోపాథ్యాయ హీరోయిన్లుగా ఎన్నికయినట్లు ఫిలిం నగర్ వర్గాల కథనం. "పొన్నియన్ సెల్వన్" అనే తమిళ చారిత్రక నవలకు వెండి తెర రూపం ఇస్తూ మణిరత్నం దర్శకత్వం వహిస్తుండగా నిర్మిస్తున్న చిత్రంలో "లీడర్" ఫేం రీచా గంగోపాథ్యాయ హీరోయిన్ గా మహేష్ బాబు సరసన బుక్కయ్యిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

ఈ మహేష్, మణిరత్నం మూవీ "వీరుడు" లో ఇంకా విక్రమ్, విజయ్, ఆర్య తదితరులు నటించనున్నారు. మహేష్ బాబు ఈ మహేష్, మణిరత్నం మూవీ "వీరుడు"లో "వీరుడు" పాత్రలో నటించనున్నారనీ, ఆయన చోళరాజు పాత్రలో నటిస్తున్నారని తెలిసింది. విక్రమ్ పల్లవ రాజుగా నటిస్తున్నారట. ఈ "వీరుడు" మూవీ విషయం గురించి రిచా గంగోపాథ్యాయను అడగ్గా , తాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఒక చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించాననీ ఇది తనకు సువర్ణావకాశమని, ఆ చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలో మీడియాకు తెలియజేస్తాననీ రీచా గంగోపాథ్యాయ మీడియాతో అంది. గతంలో ఈ పాత్ర కోసం అనుష్కను అనుకున్నారట. కానీ ఆమెను విక్రమ్ సరసన నటింపజేస్తారట. ఈ చిత్రం తమిళ వెర్షన్ లో విజయ్, ఆర్య నటిస్తూండగా, తెలుగులో మహేష్ బాబు, రిచా గంగోపాథ్యాయ నటిస్తున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.