English | Telugu

వచ్చే వారం నుండీ "బద్రీనాథ్" పబ్లిసిటీ షురూ

వచ్చే వారం నుండీ "బద్రీనాథ్" చిత్రం పబ్లిసిటీ షురూ అవుతుందట. వివరాల్లోకి వెళితే గీతా ఆర్ట్స్ పతాకంపై, అల్లు అర్జున్ హీరోగా, మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా, డైనమిక్ డైరేక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో, మెగా ప్రొడ్యుసర్ అల్లు అరవింద్ నిర్మిస్తున్న చిత్రం "బద్రీనాథ్". ఈ "బద్రీనాథ్" చిత్రం యొక్క పబ్లిసిటీ వచ్చే వారం నుండి ప్రారంభం కానుందని సమాచారం. ఈ "బద్రీనాథ్" చిత్రం కోసం హీరో అల్లు అర్జున్ వియత్నాం వెళ్ళి అక్కడ ఫైటింగ్ సీన్ల కోసం ప్రత్యేక శిక్షణ పొందారు. ఈ శిక్షణ ప్రముఖ యాక్షన్ కంపోజర్ పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో జరిగిందట. ఈ "బద్రీనాథ్" చిత్రం షూటింగ్ కులూ మనాలీలో జరిగింది.అక్కడ ఈ "బద్రీనాథ్ ‍" చిత్రం కోసం ఒక భారీ సెట్ ను కూడా నిర్మించారు.

అల్లు అర్జున్ హీరోగా నటించిన "బన్నీ" చిత్రం తర్వాత వినాయక్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం ఇదే కావటం గమనార్హం. ఈ "బద్రీనాథ్" చిత్రం రానున్న వేసవి శలవుల్లో "మే" నెలలో విడుదలయ్యే అవకాశాలున్నాయి. హీరో అల్లు అర్జున్ వివాహం అయిన తర్వాత విడుదల కాబోతున్న తొలి చిత్రం "బద్రినాథ్" కావటంతో ఇది సూపర్ హిట్టవ్వాలని అల్లు అర్జున్ అభిమానులు కోరుకుంటున్నారు.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.